పుట:Sukavi-Manoranjanamu.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ తృతీయ చరణములందు వరుసగా ఢ, త అను గురువులు లఘువులు.543

'సంయుక్తే సంస్కృతాద్యే స్వా, త్సర్వమాంధ్రపదం లఘు
భవే బాద్య సమాసేపి, రేఫయోగాత్పరం తథా
పదేపి చ తథాత్వం స్యాత్ క్వచిన్నైవ న రేభయోః
సర్వాస్వపి చ భాషాసు, రహయుక్తేక్షరే పరే
పూర్వవర్ణస్య లఘుతా, వేష్టా మల్హాది కేపి చ'

అని అధర్వణసూత్ర మున్నది గాన గీర్వాణమంచును ఈలాగు కలదు. ఉదాహరణము శిశుపాలవఛ యందలి

ప్రాప్తనాభిహ్రద మజ్జన...

మనునది వ్రాసినారు. మరియును గలవు. నన్నయభట్ట కారిక—

'ఈ దంతా ఇద్వదేవ కృత హ్రస్వాః' (ఆ. శ. చి. అజం. 41)


'రేఫ సంయోగే పరే పూర్వ వర్ణస్య లఘుత్వే. 'శత తాళదఘ్న హ్రదమునఁ బడియెన్' ఇత్యాదయః కవి ప్రయోగాః ఉవాహరణమ్'
(క. శి. భూ. పు. 173)

అని అహోబల పండితులు వ్రాసినారు.544 ప్రతాపరుద్రీయము నందు చెప్పబడిన పదదోషములలో క్లిష్టమున్న దొకటి. దానికి లక్ష్య మిట్లున్నది—

'నభస్వదశ నారాతి ధ్వజాగ్రజ విరోధిషు (దోష. 15)


“నభస్వదశనా స్సర్పాః తేషా మరాతిర్గరుత్మాన్. స ఏవ ధ్వజో యస్యేతి విష్ణు, స్తస్యాగ్రజ ఇంద్ర, సస్య విరోధిషు పర్వతేష్విత్యర్థః ప్రతీతే రతి దూరణ్వాత్ క్లిష్టమ్'

అని వ్రాసినారు. అతి దూరార్థమైనందున 'క్లిష్ట' మను దోషమును చెప్పినారు, సరే.545