ద్వితీయ తృతీయ చరణములందు వరుసగా ఢ, త అను గురువులు లఘువులు.543
| 'సంయుక్తే సంస్కృతాద్యే స్వా, త్సర్వమాంధ్రపదం లఘు | |
అని అధర్వణసూత్ర మున్నది గాన గీర్వాణమంచును ఈలాగు కలదు. ఉదాహరణము శిశుపాలవఛ యందలి
| ప్రాప్తనాభిహ్రద మజ్జన... | |
మనునది వ్రాసినారు. మరియును గలవు. నన్నయభట్ట కారిక—
| 'ఈ దంతా ఇద్వదేవ కృత హ్రస్వాః' (ఆ. శ. చి. అజం. 41) | |
| 'రేఫ సంయోగే పరే పూర్వ వర్ణస్య లఘుత్వే. 'శత తాళదఘ్న హ్రదమునఁ బడియెన్' ఇత్యాదయః కవి ప్రయోగాః ఉవాహరణమ్' | |
అని అహోబల పండితులు వ్రాసినారు.544 ప్రతాపరుద్రీయము నందు చెప్పబడిన పదదోషములలో క్లిష్టమున్న దొకటి. దానికి లక్ష్య మిట్లున్నది—
| 'నభస్వదశ నారాతి ధ్వజాగ్రజ విరోధిషు (దోష. 15) | |
| “నభస్వదశనా స్సర్పాః తేషా మరాతిర్గరుత్మాన్. స ఏవ ధ్వజో యస్యేతి విష్ణు, స్తస్యాగ్రజ ఇంద్ర, సస్య విరోధిషు పర్వతేష్విత్యర్థః ప్రతీతే రతి దూరణ్వాత్ క్లిష్టమ్' | |
అని వ్రాసినారు. అతి దూరార్థమైనందున 'క్లిష్ట' మను దోషమును చెప్పినారు, సరే.545