అచ్చు పుస్తకములందు లక్షణభంగ మనుకొని 'కామరోషముల' అని దిద్దినారు.535
ఉద్యోగపర్వము (2-24) —
చ. |
అనవుడు నిట్లను న్విదురుఁ డక్కట ధర్మసుతుండు బాంధవుం
డును చెలికాడునుం దగు భటుండును బ్రెగ్గడయుం గురుండుగా
డె నరవరేణ్య ధర్మప్రకటికృతచిత్తుఁడు శాంతమూర్తి స
ద్వినయవివేకశీలముల విశ్రుతుఁ డాతఁడు కీడు వల్కునే.
| 536
|
శల్యపర్వము (1-221) —
చ. |
కృపకృతవర్మలం గడిమి గిట్టి శిఖండి ప్రభద్రకుల్ మహో
గ్రపువడిఁ దోడ్పడంగ భుజగర్వము చూపిన నా బలాఢ్యులన్
(గుపితమనస్కులయ్యుఁ బలుగోల్తలఁ జేర్చిన లావు చేవఁ గ
య్యపు నెరవేల్పు దాల్మి సరివచ్చెడు పాటున ముంచెఁ జూపఱన్.
| 537
|
ఈ పద్యము లచ్చు పుస్తకములందు దిద్దలేదు. ఇక్కడ నేమనుకొనిరో తెలియదు.538
కాశీఖండము (4–81) —
సీ. పా. |
సంధ్యాభివందన శ్రద్ధయుజ్జన సేయు
గీతవాద్యవినోదక్రియలఁ దగులు...
| 539
|
అచ్చు పుస్తకము లందు 'వినోదకేలి' యని దిద్దినారు.540
సభాపర్వము (1-78) —
ఉ. |
వానికి నెయ్యుఁడై యమరవంద్యపదాంబుజుఁ డంబికాబృహ
త్సీనపయోధరాగ్రపరిపీడితవక్షుఁడు భూషణీకృతా
హీనుఁ డశేషలోకగురుఁ డీశ్వరుఁ డెప్పుడు నంద యుండు నా
నా నిశితాయుధాయుత సనాథ మహాద్భుతభూతకోటికిన్.
| 541
|
రాఘవపాండవీయము (1-35) —
క. |
వేంకటవరదుఁడు వెలయు ని
రంకుశవితరణనిరూఢప్రజ్ఞను రణని
శ్శంకితప్రాభవమున నక
లంకితకీర్తిప్రతాపలక్ష్ముల మహిమన్.
| 542
|