పుట:Sukavi-Manoranjanamu.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కదాపి పర్యటన్ శశ విషాణ మాసాదయే
న్నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్త మారాభయేత్.

529

ఇది పృథ్వీవృత్తము. "జసౌజసయలా వసుగ్రహ యతిశ్చ పృథ్వీ గురుః" అను లక్షణము వలన ప్రథమ చరణమందు 'ల', ద్వితీయ చరణమందు సు', చతుర్థ చరణమందు 'ర్ఖ' పదాంత (వర్ణ)ములుగాన యతిభంగములు.530

వృత్తరత్నాకరము

వంశే భూ త్కాశ్యపస్య ప్రకట గుణగణ శ్శ్తైవ సిద్ధాంత వేత్తా
వీరః పచ్చేక నామా విమలతరమతి ర్వేదశాస్త్రార్థ బోధీ
కేదార స్తన్యపుత్ర శ్శివచరణయుగారాధనైకాగ్ర చిత్త
ఛదస్తే నాభిరామం ప్రవిరచిత మిదం వృత్తరత్నాకరాఖ్యమ్.

531

తృతీయ చరణమందు 'రా' ద్వితీయ వర్ణము యతి. లాక్షణికుడే ఇట్లు రచించగా ఆలంకారికులు యతిభంగ, ఛందోభంగములు దోషములనరాదు. ఇన్నిప్రయోగములు బాలుర తెలివిడి కొఱుకు వ్రాసినాము. పదమధ్య పదానసాద వర్ణములు యతులు గలవు. పాదాంతగురువు లఘువు కలదు. పాదమధ్య గురువును లఘువు కలదు.532

తిమ్మకవి లక్షణసారసంగ్రహము (2-23)
గీ.

సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు
నపుడు క్రారను గూడిన యక్కరంబు
లూదియుండు నొకొక్కచో నూదకుండు
తెనుఁగు కృతులందు సామజాజిన నిచోల.

533
లక్ష్యములు
శాంతిపర్వము (4–81)
ఉ.

కావున కామక్రోధములు గ్రాచుచు నాశ్రిత కోటి (గాచుచున్
భూవలయప్రజన్ సమతఁ బ్రోచుచు రాజ్యముసేత మేలు భి
క్షావిధి లోనుగా గలుగు సారపు ధర్మములం ఘటించు మే
ల్వావిరి ప్రయత్నమున వానికి వచ్చు నృపాల యమ్మెయిన్)

534