పుట:Sukavi-Manoranjanamu.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థచరణమందు 'ఈశ్వర' పదమధ్యమందు తన 'శ్వ' వర్ణము యతి. ఇచ్చట ద్వితీయ వర్ణమే యతి. మరి యతిభంగ మెందుకు కాకపోయెనో తెలియదు.514

గీర్వాణ కవిత్వమందు, యతి యనగా నిలుపుటేకాని, పదమధ్య, పదావసానము కాకూడదని కాదు. ఆలంకారికులు చెప్పిన యతిభంగ చ్చందోభంగములు ప్రతికావ్యమందును గలవు. ఇవి దోషములైతే మహాకవు లేల రచింతురు! ఇంకను కొన్ని ఉదాహరణములు వ్రాసుతున్నాము.515

ప్రబోధచంద్రోదయము

ఏకత్రిస్సప్తకృత్వో నృపబహుల వసామాంసమస్తిష్కపంక
ప్రాగ్భారేకారి భూరిచ్యుతరుధిరసరి ద్వారిపూరాభిషేకం
యస్య స్త్రీబాలవృద్ధావధి నిధనవిధౌ నిర్దయో విశ్రుతోసౌ
రాజన్యోచ్ఛాంసకూట త్రుటన పటురటద్ఘోరధారః కుఠారః

516

(తృతీయ చరణమందు) 'అవధి' యందలి ద్వితీయ వర్ణము యతి.517

స్ఫురద్రామోద్భేదస్తరలతర తారాకుల దృశో
భయోత్కంపోత్తుంగస్తనయుగభరా సంగసుభగః
అధీరాక్ష్యాశ్శింజన్మణివలయ దోర్వల్లిరచితః
పరీరంభామోదం జనయతి చ సమ్మోహయతిచ.

518

ప్రథమ చరణమందు తారాలోని 'రా' యతి. చతుర్థ చరణమందు (పాదాంతలఘువు గాన) ఛందోభంగము. రెండు దోషములు చెప్పవలెను. 519

ఇందు ‘వల్లి' ఇకారాంతము, 'పరీరంభ' పదములో 'రీ' దీర్ఘము.520

దండి విరచిత 'అనామయము'

స్తోత్రం సమ్యక్ఫరమవిదుషా దండినా వాచ్యవృత్తా
న్మందాక్రాంతా త్రిభువనగురోః పార్వతీవల్లభస్య
కృత్వా స్తోత్రం యది సుభగ మాప్నోతి నిత్యం హి వృణ్యం
తేన వ్యాధిం హరహర నృణాం స్తోత్రపాఠేన సత్యమ్.

521

తృతీయ చరణమందు 'ప్నో' యతి. ద్వితీయ చరణమందు పాదాంతలఘువు గురువు. ఇది మందాక్రాంతవృత్తము.