పుట:Sukavi-Manoranjanamu.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేరే ఘూర్జర జర్ఘరోసి సమరే లంపాక కిం కంపసే
వంగ త్వంగసి కిం ముధాబలరజః కాణోసి కిం కొంకణ'— (నాయక 31)

అనుచోట పాదాంతమున 'ణ' లఘువు గురువు విద్యానాథుని గారి ప్రయోగములే ఎన్నోగలవు. 'ఇంద్రవజోపేంద్రవజాది' అని వ్యాఖ్యయందు వ్రాసిరి గాన, శిఖరిణీ, శార్దూలములు 'ఆది'లోనివని తలంతురు.490

శ్రీ వీరభద్ర నృపతేః ప్రియ వల్లభస్య
రాజ్యాబిషేక సలిలై స్సరసీ కృతాయాః
సద్య స్సముచ్ఛ్వసిత సాంద్ర పరాగరేఖా
క్షోణ్యాః ప్రమోద పులకాంకుర మంజరీవ.

491

రెండు పాదాంతలఘువులు గురువులుగా నుండెను.492

'శ్రీ కాకతీంద్ర నగరీ మనిశం స్తువంతి'

మరియును వసంతతిలకములే గలవు. వ్యాఖ్యాకారు లచ్చట నేమనుకొనిరో తెలియదు. వృత్తరత్నాకరమందు—

'ఉక్తా వసంత తిలకా తభజా జగౌగ'

అని లక్షణము, లక్ష్యము చెప్పి, ఈ వసంతతిలకమునకే మరియును నామధేయములు గలవని చెప్పిన శ్లోక మిదిః —

సింహోద్దతేయ ముదితో ముని కాశ్యపేన
ఉద్ధర్షిణీయ ముదితా మునిసైతవేన
సోమేన సేయ ముదితా మధుమాధవీతి
శోభావతీయ ముదితా భుజగాధిపేన.

ఇందు నాలుగు పాదాంతలఘువులు గురువులుగా నుండెను. కోలచల కుమారస్వామిగారు వృత్తరత్నాకరము నేమి పరిశీలించిరో తెలియదు. మరియును కొన్ని వసంతతిలకలు ఉదాహరించుతాము.493

జగన్నాథ పండితరాయ శతకము

నీలం వపు ర్వహతు చుంబతు సత్ఫలాని
హర్మ్యేషు సంచరతు చూతవనాంతరే వా
పుంస్కోకిలస్య చరితాని కరోతునామ
కాకః కలస్వన విధౌ స తు కాక ఏవ.

494

—మూడు పాదాంత లఘువులు.