పుట:Sukavi-Manoranjanamu.pdf/498

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆదిపర్వము (1-107)
చ.

అరిది తపోవిభూతి నమరారులు బాధలు వొందకుండఁగా
నురగుల నెల్లఁ గాచిన మహోరగనాయకుఁ (డానమత్సురా
సురమకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు బ్రసన్నమయ్యెడున్.

454
అరణ్యపర్వము (4-100)
క.

మృగయార్థ మరిగి హిమవ
న్నగభూముల యందుఁ బవననందనుఁ డొకప
న్నగుచేత పట్టువడి (యి
మ్ముగ ధర్మతనూజుచేత మోక్షితుఁ డయ్యెన్)

455
కర్ణపర్వము (2-74)

తలకొని జలములఁ బక్షం
బులు దుండము దోక జోక బొగిపొరి నెగయన్
బలమరి మై దిగఁబడఁగా
సొలసి యెగయ లేక వాయసుఁడు దెగడొందెన్.

456

ఇటువలెనే తెలుసుకొనేది.457

హంస - హంసము; దూత - దూతుఁడు అని గలవు. చరిత-చరిత్ర తరంగాంకాక్షతాది పదములు రెండు విధములు గలవు.458

అసుర పదము స్త్రీలింగము వంటిది.459

'సురలు' (దీనికి) ఏక వచనము లేదు.460

ఆప్ శబ్దము(నకు) ఏకవచనము లేదు.461

“అప్పుపాలైన శుభ్రాజ్ఞంబు రుచియెంత" ఇత్యాదయః కవిప్రయోగాస్తు న సాధవః. 'అప్పుల పాలైన యజ్ఞంబు రుచియెంత' ఇత్యాది పాఠ స్సాధుః. అని అహోబలుడుగారు కవిశిరోభూషణమున నన్నారు.

వసుచరిత్రము (1-36)
సీ.పా.

తన కూర్మిరేని నప్పుననే ముంచె.

'అప్సరసలు - అప్సర' రెండు గలవని అహోబల పండితులు కవిశిరోభూషణమున వ్రాసినారు.462