పుట:Sukavi-Manoranjanamu.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ధనవర్గంబులు వీ రి
చ్చిన యవి యట్లగుట వేడ్క సేయవు తగ నూ
తనమగు కానుక యీవల
యును దోడ్తేరంగఁ బనుపు ముత్తరఁ బ్రీతిన్.

అని (విరాట. 5–358) ఉత్తరుడే చెప్పినాడు. 427
ఎఱ్ఱనగారి హరివంశము. (ఉ. భా 4-275)
క.

అందఱు హరిదెస ప్రణయ
స్యంది మనోజ్ఞులును లబ్ధసంతానులునై
నందించిరి హరిమహిమల
చందము నజుకైన బొగడ శక్యమె బుద్ధిన్.

428

కవిత్రయ ప్రయోగముల మూడును గలవు.429

శ్రీనాథుని నైషధము (6–115)
ఉ.

(లాలనఁ గ్రొత్త బెబ్బులి కలాసము వెట్టిరి యాసనంబుగా)
గోలయు సాధువైన యొక కోమటికిన్ నిషధేంద్రు బచ్చుకున్
(మేలపుమై వడిం దమ సమీపపు ధూర్తులు తత్పురఃస్థలాం
గూలత యవ్వణిక్కునకుఁ గోళ విజృంభణ శంక సేయఁగన్)

430
కవికర్ణరసాయనము (3-117)
సీ. పా.

నీ తూపు కోర్వక నిటలాక్షుఁడును తనూ
             ఫలకంబు చాటును బాయఁ డెపుడు......

431

ఇటువలెనే మహాకవి ప్రయోగములు కలవు.432

అహోబలుడు కవిశిరోభూషణమందు

“నః కౌ. నే రపవాదః. నామ్నః కౌపరే నః స్యాత్. రామునకు కృష్ణునకు ఇత్యాది. ఉకారాదేకాక్షర గతా దూకారా దృకారాచ్చ పరోయం నకారః
అత ఏవ ద్వితీయాచార్యేణోక్తమ్.