పుట:Sukavi-Manoranjanamu.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


“సర్వేషామే మచోదంత శబ్దానాం కౌపరే భవేత్
నః ప్రాయః స్యా దుకారాచ్చ సర్వపండిత సమ్మతే”.
రితి. 'రామాయణముగ రచించి ప్రాచేతసుకున్' ఇతి భాస్కరోక్తి రసంగతైవ. 'కై' విభక్త్యా పాఠ స్సాధుః. "వంతుకు వచ్చు సత్యగరువంబిక' ఇత్యత్ర ‘వంతున కెక్కు సత్యగరువం' బిత్యేవ పాఠ స్సాధుః. వ్యాకరణ ద్వయేపి నస్యైవ విధానాత్. విధాతృ... ఋకారాంతో దాహరణమ్. ప్రాయో గ్రహణా దూదంతతాదపి భవతీతి జ్ఞేయమ్.”

అని వ్రాసినారు.433

ఈ సూత్రమునకే బాలసరస్వతులవారు—

“కౌ=కు అనే విభక్తి పరమైతే నః=న అనే ఆగమము వచ్చును. 'ని' యనేది రాదు. అనితాం=ఇకారాంత వ్యతిరిక్తములైన నామముల యొక్క, జమః=షష్టికి, కు అనేదివచ్చును. రామునకు, సామాన్యాకారమున న్యాగమము వచ్చితే ఇకారాంత మవుచున్నది గనుక, 'అనితాం' అనే పర్యుదాసచేత నుక్వాదేశము రాదు 'ఙసః కిచ్చ' అను వక్ష్యమాణసూత్రము చేత 'కి' వచ్చును. 'రామునికి' అను రూపమున్ను గలదు.

అని వ్రాసినారు.434

అయితే, ఎంతటి పండితులకు నొకచోట భ్రాంతత్వము గలదు. అందఱు పండితులకు నొకచోటనే భ్రాంతత్వము గలుగదు. ఇన్ని ప్రయోగములు దిద్దక రెండు మాత్రము (అహోబలుడు గారు) దిద్దినారు. (అది) వారి ఔద్ధత్యముగాని (అవి) అసాధువులుగావు. రామునికి, రామునకు, రాముకు అని మూడు విధముల నుండవచ్చును.435


క.

గురునికి గురునకు ననఁగాఁ
బరఁగఁగ బాలునికి ననఁగ బాలున కనగా
(గరగకు గొరవకు ననఁగా
దరమున కుదరమునకు నా నుదాహరణంబుల్) (6)

436

అని నూత్నదండి ఆంధ్రభాషాభూషణమున (చెప్పినారు) 'విధాతకు” అనవచ్చును.437