‘మానం' అని అహోబల పండితులవారు నిశ్చయించుటకు కారణమేమిటో తెలియదు మంచిదే. ఇది అధర్వణ కారిక చేతనే వచ్చెననుకుంటే, క్రోడ, వ్రీడాది శబ్దములు ఆకారాంతములు, హ్రస్వములుగా నుండుటకు తను, చంచ్వాది శబ్దములు హ్రస్వముగా నుండుటకు ఎవరికారిక (కారణమో) తెలియదు. 200
కోశాదులందున, వ్యాఖ్యానాదులందున పరిశీలించి కొన్ని కొన్ని శబ్దముల (రూపములు) వ్రాసినాము. కొన్ని కొన్ని శబ్దములకు లక్ష్యములు వ్రాసుతాము.201
సీ.గీ. | వందీ వ్రాలి కుంది వాడిన యిల్లాలి | 202 |
| అబ్జగర్భుండు సుషమాసమాప్తియందు | 203 |
లేఖకులు ‘చుబుక’ మని పుస్తకములందు వ్రాసినారు. అది లేఖకప్రమాదము. భానోజీ దీక్షితులుగారు తమ అమరసుధావ్యాఖ్యయందుః -
| “చివతి చివ్యతే వా, చివ్వ ఆధాన సంవరణయోః | |
అని వ్రాసినారు. ఇక 'గురుబాలప్రబోధిక' యందు—
| 'చీయతే త్వఙ్మాంసాదిభి రితి చిబుకం. చిఞ్ చయనే.' | |
అని వ్రాసినారు. 'శబ్దార్థకల్పతరువు' నందు చాదులు ఇత్వాదులు (నైన పదములందు)