పుట:Sukavi-Manoranjanamu.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పారిజాతాపహరణము (5-108)
సీ.

కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ
             సూత్రుఁ డార్వేలపవిత్రకులుఁడు
నంది సింగామాత్యునకుఁ దిప్పమాంబకు
             తనయుండు సకలవిద్యావివేక
చతురుండు మలయమారుతకవీంద్రునకు మే
             నల్లుఁడు కృష్ణరాయక్షితీశ
కరుణాసమాలబ్ధఘనచతురంతయా
             నమహాగ్రహారసన్మానయుతుఁడు
తిమ్మనార్యుఁడు శివపరాధీన మతి, య
ఘోర శివగురు శిష్యుఁడు పారిజాత
హరణ కావ్యమును రచించె నాంధ్రభాష
నాదివాకరతారాసుధాకరముగ.

82
తిప్పమాంబ, తిమ్మనార్యుడు.
చాటుధార
క.

మాకొలది జానపదులకు
నీ కవితారీతి యబ్బునే కూపనట
ద్భేకములకు నాకధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా!

83
చాటుధార
ఉ.

ఆరవి వీరభద్రచరణాహతిఁ బోయిన బోసినోటికిన్
నేరకపోయె, రామకవి నేరిచెఁబో మన ముక్కుతిమ్మన
క్రూరపదాహతిం బడిన కొక్కిరపంటికి దుప్పికొమ్ము, బ
ల్గా రచియించినాఁడు రవి గాననిచోఁ గవి కాంచునే కదా!

84
ఒక పద్యమందు 'అమ్మ' అని, రెండు పద్యములందు 'తిమ్మన' అని యున్నది. మరియును— 85