పుట:Sukavi-Manoranjanamu.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కొందఱు కోనయ-కోనయ్య, రామయ-రామయ్య, సింగన-సింగన్న, వెంకమ-వెంకమ్మ, - ఈ మొదలైనవి ఏకపదములేగాని, వాటిలో అయ, అయ్య, అన, అన్న; అమ, ఆమ్మ; అని పదవిభాగము లేదంటారు. ఆంధ్రగీర్వాణాదులందు నామధేయమొకటేగావున అమాత్య, మంత్రి, దండనాథులు పురుషులకున్ను; అంబాదులు స్త్రీలకున్ను చెల్లునవుడు మధ్యను తెలుగుపదములైన అయ, అయ్య మొదలైనవి ఉండరాదని వారి తాత్పర్యము, కావున రామయ్య, వెంకమ్మ మొదలైనవి ఏకపదములే (అని అంటారు ) 78
(మరి ఇదే సరి) అయితే ప్రభునామయతులందు (రామయ్య, వెంకమ్మ ఇత్యాదులలో) అచ్చులకు (యతి) చెల్లకపోవలెను. ప్రభునామయతులు ఉభయయతులని యుండగా; స్పష్టముగా 'ప్రెగడ దండనాథు' డని; 'ప్రెగడన్నదండనాథు' డని యొకనికే రెండు విధములుగా మహాకవి ప్రయోగము లుండగా విమర్శకులు చెప్పిన (పైమాట) నిలువదు. 79
ప్రబోధచంద్రోదయమునందు
సీ.

కలరు కౌశికగోత్ర కలశాంబురాశి మం
             దారంబు సంగీత నంది, నంది
సింగమంత్రికిఁ బుణ్యశీలయౌ పోచమ్మ
             కాత్మసంభవుఁడు మల్లయ మనీషి
యతని మేనల్లుఁ డంచితభరద్వాజ గ
             త్రారామచైత్రోదయంబు ఘంట
నాగధీమణికి ధన్యచరిత్ర యమ్మలాం
             బకుఁ గూర్మి తనయుఁడు మలయమారు
తాహ్వయుఁడు సింగనార్యుడు నమృతవాక్యు
లీశ్వరారాధకులు శాంతు లిలఁ బ్రసిద్ధు
లుభయభాషల నేర్పరు.......
మర్థు లీ కృతిరాజు నిర్మాణమునకు.

80
ఇందు ‘మల్లయ మనీషి' యను చోట ప్రభునామయతి. 81