పుట:Sukavi-Manoranjanamu.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పారిజాతాపహరణము (1-14)
క.

ఆ నరస మహీమహిలా
జానికి కులసతులు పుణ్యచరితులు తిప్పాం
బా నాగాంబిక లిరువురు
దానవదమనునకు రమయు ధరయుం బోలెన్.

86
కవి ‘అమ’ శబ్దము లేకుండగా 'తిప్పాంబా' 'నాగాంబిక' యని ప్రయోగించినాడు. నాగాంబిక అని నామకరణమే అయితే ఆకవియే ఆనాగాంబికనే (ఈ క్రింది పద్యమున) 87
శా.

వీరశ్రీనరసింగ శౌరిపిదపన్ విశ్వక్షమామండలీ
ధౌరంధర్యమునన్ జగంబు ముదమొందిన్ నాగమాంబాసుతుం
డారూఢోన్నతిఁ గృష్ణరాయఁడు విభుండై రత్నసింహాసనం
బారోహించె విరోధు లాగహనశైలారోహముం జేయఁగన్. (పారి. 1-18)

89
'నాగమాంబ' అని ప్రయోగించెను. కవీశ్వరుల యిష్టముగాని మరేమియులేదు. 89
వసుచరిత్ర (1-85)
క.

ఆమనుజేంద్రునకుఁ బురం
ధ్రీమణి యగు తిమ్మమాంబ శ్రీరామునకున్
భూమిజ, సుత్రామునకు పు
లోమజయను బోలె జగతిలో నుతికెక్కెన్.

90
సోమనాథ శాస్త్రులవారు ఈ పద్యవ్యాఖ్య యందు 'తిమ్మమాంబ' అని ప్రయోగించి నందుకు (అది) కవి ఔద్ధత్యమని వ్రాసినారు. మహాకవి ప్రయోగములలో బహులముగా రెండువిధముల నుండిన 'తిమ్మమాంబా'ది ప్రయోగముల నహోబల పండితులవారు నిషేధించి నందున, వారి మతము ననుసరించే, 'తిమ్మమాంబ' అని ప్రయోగించరాదని సోమనాథ శాస్త్రులవారు కోపమును ప్రకటించినారు. ఈ వెఱ్ఱి ఆధునికులకున్ను కొందఱికి గలదు. అటువంటి సర్వోత్కృష్ట పండితులకే ఉండగా ఆధునికుల కుండుట వింతగాదు. (మరికొన్ని ప్రయోగములు వ్రాసుతాము.) 91