ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| జ్ఞాతివైరంబు నంది ప్రాసంబులందు | 230 |
(అ.క. 2-229)
| 'నాన్యేషాం వైధర్మ్యం లఘ్వలఘూనాం | |
అని వాగనుశాసన సూత్రమునందుననె (యున్నందున) లాక్షణికులు రేఫ ఱకార(ములు యతి) ప్రాసములకు కూడ దన్నారు కాని — 231
నన్నయభట్టుగారు, తిక్కన సోమయాజులగారు, ఎఱ్ఱాప్రెగడగారు — వీరు కవిత్రయము వారు. వీరు ముగ్గురును తెలుగు చేసినది భారతము. తిక్కన సోమయాజులగారు 'ఉత్తర రామాయణము' తెలుగు చేసినారు. ఎఱ్ఱాప్రెగడగారు (హరివంశము రచించినారు). ప్రత్యేకము 'రామాయణము' రచించినారు. మరియును గ్రంథములు రచించినారు. అటు(వంటి మహాకవుల ప్రయో)గములకు లాక్షణికులు నిర్ణయించిన రేఫ ఱకారములకు — (సరిగా) పరిశీలించ నందున వ్యత్యస్తములు గలవు. ఇదివరకు మిక్కిలియు లక్ష్యములు వ్రాసినాము.(ఇంకను బహులములు గలవు. కాని) గ్రంథ విస్తరమగుటవలన నిలిపి (వేసినాము. బుద్ధిమంతులు గ్రంథములందు పరిశీలించి ఇంకను తెలిసికొనేది.) 232