పుట:Sukavi-Manoranjanamu.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

వేరనలేరు ధారుణి నవీనతరాంధ్రకవిత్వసంపదా
ధార రసజ్ఞులైనఁ గవితల్లజులైన వినుండు పాండితీ
పారగులార యో పరమబంధువులార తదీయశబ్దసం
భారము పారముం దెలియ పాల్పడ నేనసుడీ నిజంబుగన్.

215
అని రేఫముగా ప్రయోగించిరి. స్వకవిత్వమున సాంకర్యమే కలిగెను. వారు 216

'గట్టిగ నభినవ నన్నయ
భట్టాచార్యాభిధాన పటు బిరుదాంకం
బట్టిట్టనక వహించిన
దిట్టను నను బోలఁగల సుధీమణు లేరీ?'

అని స్వమహిమ ప్రకటించుకొనిరి. కాని, వేరు ఉభయము గలదు. 217
ఎఱ్ఱనగారి హరివంశము (ఉ.భా. 4-112)
క.

పోరాని చుట్ట మితఁడని
కూరిమి చెలికాఁ డనంగఁ గోరి వరుస గో
త్రారి హరి బాంధవుల వే
ర్వేరం గుశలంబు లడిగెఁ బ్రియ మలరారన్.

218
ఉద్యోగపర్వము (2–116)
గీ.

పాండురాజ తనూజుల పాలి కర్థి
నిమ్మహారాజు పనుపంగ నేఁగి ధర్మ
పుత్రుఁ గాంచితి నాతఁడు మైత్రి మెఱయ
గౌరవుల సేమ మెల్ల వేర్వేర నడిగె.

219
అని రెండు లక్ష్యము లుండగా కేవలము గురురేఫగా లాక్షణికులు చెప్పుటయు పరిశీలించకపోవుటే. 220
అయితే, అహోబల పండితులవారు ఉభయము గలదని యెఱిగే రేఫముగా ప్రయోగించినా రంటిరా, 'మరిగి' (అను దానిని) ఆక్షేపించరాదు. భాగవతమందు మాత్రమేమి, రాఘవపాండవీయము (2–6) నందు 221