ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్రోణపర్వము (4-191) —
క. | చెలఁగి పటు సింహనాదం | 210 |
అని చెప్పినారు.
—కాని రేఫ ఱకారముల పట్ల పరిశీలించుట(లో) అందఱికిని లోపమే. అహోబల పండితుల వారు 'పురసతుల - మఱిగి' అని రేఫ శకటరేఫముల పోతరాజుగారు కలిపినారని ఆక్షేపించినారు. అది పోతరాజుగారి కవిత్వముకాదు. (కాని అది) ఎవరి కవిత్వమైనను (మరిగి) ఉభయము కలదు. 211
ఎఱ్ఱనగారి హరివంశము (పూ. భా. 8-16) నందు —
క. | హరి చేష్టితములు క్రమమున | 212 |
అని రేఫముగా ప్రయోగించిరి. కవిత్రయమువారి ప్రయోగము గలుగగా పరిశీలించక భాగవతము నాక్షేపించుట కూడదు. లాక్షణికులు మఱిగి, వేఱు - గురురేఫము లన్నారు. (కాని) ఉభయరేఫములందు నెవరు వ్రాయలేదు. కాకునూరి అవ్పకవిగారు ‘ఆంధ్రశబ్దచింతామణి'యందు—
గీ. | వేఱు పడుటయు వీఱడి వేఱొకటియు | 213 |
అని స్పష్టముగా చెప్పిరి. 214
రేఫలమీద వకారమున కేత్వము దీర్ఘములగల పదమె. (కాని) యెవరును చెప్పలేదు. అట్టిదానికి అహోబల పండితులు కవిశిరోమణి యందు