పుట:Sukavi-Manoranjanamu.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్రోణపర్వము (4-191)
క.

చెలఁగి పటు సింహనాదం
బులు రంకెలుగాఁగ వారు బొలిచిరి వృషభం
బులక్రియ నొండొరులకు మా
ర్మలయుచు దాకుచు నుదాత్తరభసోజ్జ్వలులై.

210
అని చెప్పినారు.
—కాని రేఫ ఱకారముల పట్ల పరిశీలించుట(లో) అందఱికిని లోపమే. అహోబల పండితుల వారు 'పురసతుల - మఱిగి' అని రేఫ శకటరేఫముల పోతరాజుగారు కలిపినారని ఆక్షేపించినారు. అది పోతరాజుగారి కవిత్వముకాదు. (కాని అది) ఎవరి కవిత్వమైనను (మరిగి) ఉభయము కలదు. 211
ఎఱ్ఱనగారి హరివంశము (పూ. భా. 8-16) నందు
క.

హరి చేష్టితములు క్రమమున
మరిగి నిజముగాఁగఁ దమదు మగలఁ దొరఁగి యా
హరియంద భర్తృ బుద్ధిం
బరిణతలై రా వ్రజంబు బాలిక లెల్లన్.

212
అని రేఫముగా ప్రయోగించిరి. కవిత్రయమువారి ప్రయోగము గలుగగా పరిశీలించక భాగవతము నాక్షేపించుట కూడదు. లాక్షణికులు మఱిగి, వేఱు - గురురేఫము లన్నారు. (కాని) ఉభయరేఫములందు నెవరు వ్రాయలేదు. కాకునూరి అవ్పకవిగారు ‘ఆంధ్రశబ్దచింతామణి'యందు—
గీ.

వేఱు పడుటయు వీఱడి వేఱొకటియు
నాదిగాఁ గొని యాంధ్రవాక్యముల యందుఁ
బాదుకొను దీర్ఘముల మీఁద బండిఱాలు
దీని నెఱుఁగక కృతిసేయు వెఱ్ఱిగలఁడె.

213
అని స్పష్టముగా చెప్పిరి. 214
రేఫలమీద వకారమున కేత్వము దీర్ఘములగల పదమె. (కాని) యెవరును చెప్పలేదు. అట్టిదానికి అహోబల పండితులు కవిశిరోమణి యందు