పుట:Sukavi-Manoranjanamu.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మరియు నందే (పీఠిక. 104)
ఉ.

(రంగనవద్యమై సుధ తెఱంగన శోభిలి విన్గొలంకు చే
రం గన దిందు దీప్తి నెదురం గనకోదరు కంబుకంఠి దూ
ఱంగ ననంగు జాతిపగ ఱం గనలం గమకించి) ఠీవి మీ
ఱంగ నటంచు గొబ్బురిపురప్రభు రంగనకీర్తి రంజిలన్.

174
(అని ప్రయోగించి రేఫ ఱకారములు కలిపినాడు.)
మరి, పిల్లలమఱ్ఱి పినవీరన్న జైమినీభారతము (1-137) నందు
ఉ.

తూరుపు తెల్లవారుటయుఁ దోడనె మంగలపాఠకస్తుతుల్
మీఱఁ దదీయరాగముల మేల్కని కాల్యసమంచితక్రియల్
దీరిచి పాండుపుత్ర వసుదేవసుతుల్ ప్రమదంబు మోములం
దేరఁగ వేడ్కతో నరుగుదెంచి సభాస్థలి నిల్చి రయ్యెడన్.

175
అని, సంకుసాల నరసింగయ 'కవికర్ణరసాయనము' (5-75) నందు
గీ.

వనధి సర్వంకషంబయ్యు వలయు పనికి
ఱేపులన కాని చొర రాని రీతిఁ దవరి
విశ్వరూపకుఁ డయ్యు శ్రీ విభుఁడు కూర్మ
రూపముల సేవ్యుఁడగు నారురుక్షులకును.

176
(అని రేఫ ఱకారములు కలిపినారు.)

'నాన్యేషాం వైధర్మ్యం, లఘ్వలఘూనాం,
రయోస్తు నిత్యం స్యాత్'

అనే ఆంధ్రవ్యాకరణసూత్రమునకు టీక వ్రాసి, రేఫ ఱకారాలు కలుపరాదని చెప్పిన బాలసరస్వతిగారు తమ 'చంద్రికాపరిణయ'మందు—
ఉ.

అక్కమలేక్షణన్ సవినయంబునఁ గాంచుము నాదు మాఱుగా
మ్రొక్కుము సేమ మా భువనమోహిని నీకని పల్కు మూర్తిఁజేఁ
జిక్కితి వేగఁ బ్రోవుమని చెప్పుము పొమ్మిఁక తేటిరాయ నీ
ఱెక్కలమాటునన్ నను భరించి లభింపుము కీర్తిపుణ్యముల్.

177