(అను పద్యము' వ్రాసినారు). రేఫ, ఱకారములు రెండును ఈ యొకపద్యమువలన నెటుల తెలియవచ్చునో తెలియరాదు. సరెకదా, ఈ పద్యమైనను - పామరులకును తెలియవచ్చెడు తప్పుశబ్దము - అనగా, ఆ శబ్దమేలేని లక్ష్యము వ్రాసినారు. శ్రీకృష్ణమూర్తి వనమునందు శరీరమును వదిలిన పిమ్మట నర్జునుఁడు నక్కడికి వెళ్ళి విచారించుచున్న సమయమందలి పద్యము (ఇది). ఈ పద్యముకు పైపద్యములు, క్రిందిపద్యమును, ఇదియును పరిశీలించితే సులభముగానే పొరపాటు స్పష్టమవుతున్నది.— 8
ఉ. |
అమ్మేయి నూరకుండ ననుయాయి జనమ్ములఁ బెక్కులాడి చి
త్తమ్ము కలంకదేర్చి యుచితక్రియకు న్మొగకొల్పి బంధుసం
ఘమ్ముల నిందుఁ దెత్తమొ వికారవిదూర! యుపేంద్ర భవ్యదే
హ మ్మల గొంచుఁబోదమొ సమర్థవిధం బొక టేర్పఱింపుమా.
| 9
|
చ. |
అని యడుగంగ దైవగతి నంబుధి పట్టణ మాక్రమించు టె
ద్దినమున నొక్కొ యన్వగ మదిం జొనిపెం గురునాథ! యిప్పుడ
వ్వినుతగుణాభిరాముఁ డడవిం దను త్రిమ్మటఁజన్న ప్రొద్దుల
య్యనుచరకోటితోడఁ దెలియం దలపోయఁగ లెక్కతోచినన్.
| 10
|
క. |
మఱునాడ యగుట లెస్సఁగ
నెఱిఁగె నినుం డపుడు వేడి యెడలిన దీప్తుల్
తుఱగలిఁగొని పశ్చిమగిరి
చఱికి ననతిదూరమున విశదుఁడై తోచెన్.
| 11
|
సీ. |
దానికి జనములు దాను నుత్తులమంది
చర్చించి కార్యంబు చాయ గాంచి
మనము కృష్ణునిఁ గని చనుదెంచుఁవారమై
పురమున నివ్వార్త పుట్టకుండ
నడచి యిచ్చట మాట లవి కొన్ని ఘటియించి
చెప్పి యీరేయి చెచ్చెరఁ బ్రయాణ
|
|