పుట:Sukavi-Manoranjanamu.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(అను) ఈ పద్యమును మాత్రము లక్ష్యము వ్రాసినారు. 'నీవే' అనుచోట తాము నిర్ణయించిన భీతి, శోక, తర్క, గీత, దూరాహ్వాన, సంశయములు కనుపించవు. 'నిశ్చయ' మనే కాకుస్వరము స్పష్టముగా నున్నది. 'రఘుపతీ' (అనుచోట) దూరాహ్వానము. కాకుస్వర ప్లుతములకు యతి. మరియు ననేకములు గలవు. 535
విరాటపర్వము (2-212)
క.

మాయరవి యేల గ్రుంకడొ
కో యను నిట్టేలఁ దడసెనో యనుఁ గ్రుంకం
బోయెడుఁ బొ మ్మిప్పుడ యను
దాయపఱచె నను మనోజతాపము పేర్కిన్.

536
చేమకూరవారి సారఁగధరచరిత్రము (1-34)
శా.

'లేలే భోజన మేటి కొల్ల విటు లే లే మేన బల్సొమ్ములే
వే లే పూనవు వెల్లఁబాఱె మొగమే మీ రాజుతో...'

537
రెండవ చరణమందు రెండును ప్రశ్నలు. 538
హరిశ్చంద్రోపాఖ్యానము (4-143)
క.

కౌశికసంయమి మాయా
పాశంబును జేతఁ గట్టువడితిమి మదిలో
లేశము ధైర్యము వదలకు
డీ శాశ్వతకీర్తి సత్యమే యొనగూర్చున్.

539
నిబోధకత నిశ్చయము (చివరి చరణమందు) 540
తారాశశాంకవిజయము (4-73)
శా.

ఔనే ముద్దులగుమ్మ కల్కి తగునే యందంపు పూరెమ్మ హౌ
దౌనే చక్కదనాల యిక్క యదియౌ నబ్జాస్త్రు చేఢక్క మే
రే నీలాలక యంచు నే బొగడ నెంతే వింత పుంభావకే
లీనాట్యంబున నన్ను నేలిన వగన్ నేనెంతుఁ గాంతామణీ!

541