పుట:Sukavi-Manoranjanamu.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్రుమిడి యీడ్చినవాఁడు భర్గుని కిరీట
కోటికాభరణంబైన కువలయాప్తు
మిగులఁ జక్కని కొడుకండ్రు మింట నడుమ
గ్రహములం దీతఁ డెవ్వఁడో గణములార.

529
రెండవ చరణమందు రెండవ యతి.530

స్వరయుగయతి (ఫ్లుతయుగయతి)

లక్షణము
గీ.

వ్యంజనము లేవి యైనను వాటితలను
గలుగు కాకుస్వరప్లుతములకు మైత్రి
దనరి స్వరయుగయతి యన నొనరు సుకవf
కృతుల సంస్ఫూర్తి శ్రీకుక్కుటేశమూర్తి.

531
అర్థము :- కాకుస్వరములకు ప్లుతమునకునైనా, ప్లుతముకు ప్లుతమునకునైనా, కాకుస్వరమునకు కాకుస్వరమునకునైనా, కేవల స్వరములకే యతి చెల్లును. అప్పకవిగారు ఇదే ప్లుతయుగయతి యన్నారు. 532
"క.

తా మే వర్ణములైనను
క్ష్మామండలమునను బ్రాణమైత్రి గలిగినన్
దామోదర ప్లుతయుగ వి
శ్రామము లనఁగాఁ బ్లుతాక్షరద్వయ మమరున్."

533
(అని లక్షణము వ్రాసి) అప్పకవిగారు
వజ్రపంజరశతకము
ఉ.

శ్రీ గజగామినీమణిని సీతనుగా నిరపాయిఁగాఁ ద్రిలో
కీగృహమేధిగా గరుడకేతనుగా భవరోగవైద్యుఁగా
నా గురునాన నిన్నె మది నమ్మితి వేఱొకవేల్పుఁ గొల్వ నీ
వే గతి కావవే రఘుపతీ శరణాగత వజ్రపంజరా!

534