పుట:Sukavi-Manoranjanamu.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జీవదలాక్షి యో రసికశేఖర యో జనరంజనైకలీ
లావహరూప యో నుతగుణా తగునా యిటు లానతియ్యఁగన్.

510
చివర (చరణ మందు). కొందఱు లాక్షణికులు (దీనిని) శోకప్లుతముకు లక్ష్యము వ్రాసినారు. 'మోమున మొలకనవ్వు... ' అని చెప్పుచుండగా శోకమనుట చిన్ని పూదేనె (ను)కారమను టెట్టిదో, యిదియు నట్టిది. ఈ పద్యముకు పదమూడవ పద్యమందు కరుణరసము కనుపించుచున్నది. 511
చేమకూరవారి విజయవిలాసము (2-193)

ఏలే శైలేయస్తని[1]
యేలే ప్రాలేయకరముఖీ యేల నయో
యేలే యాలేఖ్యాకృతి
యేలే బాలేందునిటల యేలాతి నటే.

512
తిమ్మకవి రసికజనమనోభిరామము
క.

ఏమే యామేచకకచ
యే మే వామేక్షణామణీహేమఘృణీ
యేమే సోమోపమముఖీ
యేమే మోమెత్తి చూప కిటు లేతురుటే.

513
తారాశశాంకవిజయము (2-46)
మా.

అనినన్ సంతస మంది గీష్పతి కుమారా యత్రి గర్భంబునం
జననం బొందిన నీకు నీ వినయమున్ సౌజన్య మర్యాద వ
ర్తన మంచన్మధురోక్తులుం దలఁప వింతల్ గావు రాజత్కలా
ఖనివై యొప్పెడు నీవు శిష్యుఁడగు భాగ్యం బెన్న సామాన్యమే.

514
అనుశాసనికపర్వము (2-393)
ఉ.

ఆ నగనాయకుం డొక మహాధ్వర మెంతయు వేడ్కఁ జేయఁగా
బూని మహీసురావలికిఁ బూజ యొనర్పఁగఁ దాను బ్రాహ్మణుం

  1. ముద్రితప్రతులం దీపద్యపు బేసిపాదములు వ్యత్యస్తముగా నున్నవి.