పుట:Sukavi-Manoranjanamu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డై నయమారఁగా ననలుఁ డాతని పాలికి వచ్చి నాకు నీ
వే నృప నీదు పుత్రుఁ గృప యేర్పడ దానముగాఁగ నావుడున్.

515
ఈ పద్యమును అప్పకవిగారు గానప్లుతముకు లక్ష్యము వ్రాసినారు. దూరాహ్వానము మాత్రము స్వకవిత్వము. అచ్చులకు హల్లులకు లక్ష్యము వ్రాసినారు. మిగిలిన వాటికి స్వరములే వ్రాసినారు గాని వ్యంజన మొకటియు వ్రాయలేదు. (పై పద్యమందు చివర చరణమున 'ఏర్పడ' అని యున్నది. ‘వేర్పడ' అని హల్లున్ను (ఆదినున్నది) గలదు. ఇక్కడ 'ఈవే' అని కాంక్షించుట కనుపించుచున్నది. 516
వసుచరిత్రము (4–83)
ఉ.

ఏమిటి కల్గితే కువలయేక్షణ పల్కవదేటికే వధూ
టీమణి నీవు రాఁ గడిఁది డెందము పూనితివే లతాంగి య
య్యో మనసారఁ దావక పయోధరపాలి దృఢంకపాలి యీ
వే మృదువాణి నీకు నొక యెగ్గును జేయఁగదే తలోదరీ.

517
చివర (చరణమందు) 518
రాజశేఖరచరిత్రము (2-4)
శా.

కేలీకాంచనసౌధవీథికల చక్కిం దొట్టి లోఁబెట్టి యో
ప్రాలేయాచలకన్యకాధవ కృపాపారంగతా నిద్రవో
వే లావణ్యపయోనిధీ యనుచు నావిర్ఫూతమోదంబుతో
జోలల్వాడుదు రక్కుమారకునకున్ శుద్ధాంతకాంతామణుల్.

519
స్పష్టముగా తెలియగలందులకు నిన్నిలక్ష్యము లిచ్చినాము. 520
"సంశయము" హల్లుకు
వసుచరిత్రము
ఉ.

తొంగలి ఱెప్పలం దొలఁగఁ ద్రోయుచుఁ బైపయి విస్తరిల్లి క
న్నుంగవ యాక్రమించుకొనునో ముఖచంద్రు నటంచుఁ బోవ నీ
కంగజుఁ డానవెట్టి కదియం గుఱివ్రాసె ననంగ జాఱె సా
రంగమదంబు లేఁజెమట క్రమ్మ లలాటము డిగ్గి చెక్కులన్.

521