పుట:Sukavi-Manoranjanamu.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తిమ్మకవి భర్గశతకము
మ.

కవి విద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా
సి వడిం జేతులు దోయిలించుకుని యాశీర్వాదముల్ సేయ నె
క్కువ దర్పంబున నిట్టులం గదలకే కొర్మించి నట్లుండ్రుగా
రవళిం దుర్నృపు లేమి యీఁగలరొ భర్గా! పార్వతీవల్లభా!

457
అచ్చుకు
తిమ్మకవి భర్గశతకము
శా.

మన్నెల్లం దమ సొమ్మటంచు వసుధామర్త్యోత్తమక్షేత్రముల్
గన్నారంగని యోర్వలేక దిగ మ్రింగం జూతు రల్పప్రభుల్
వెన్నప్పంబులొ బూరెలో వడలొ భావింపంగ బొబ్బట్లొ కా
యనా యెన్నఁగ వారి పాలికవి భర్గా! పార్వతీవల్లభా!

458
'భర్గా' అనుచోట 459
జగ్గకవి సుభద్రాపరిణయము
శా.

నీహారాంశుముఖీకదంబకమణిన్ నిన్గోరి సన్యాసినై
యాహారాదివిహారము ల్మరచి యత్యంతానురాగంబుతో
బాహాలింగనసౌఖ్యవాంఛ మదిలో బాటిల్ల నేనుండుచో
నాహా యిట్లఱఁజేసి యేగితె సుభద్రా! భద్రకుంభస్తనీ!

460
చివర చరణ మందు.461
భాస్కర రామాయణము (యుద్ధ 41)
ఉ.

ఏ జనకాత్మజం దశరథేశ్వరు కోడల రాముభార్యఁజుం
డో జనులార యడ్డపడరో సురలార సురారికంచు నం
భోజదలాక్షి శైలవనభూములు దాటి విభీతి నేగుచో
నీజలరాశిఁ జూచి మతి నెంతఁదలంకెనౌ యేమి సేయుదున్.

462
'అడ్డ పడరో' అనుచోట 463
ఈ పద్యమును లాక్షణికు లందఱు రోదనప్లుతయతికి లక్ష్యము వ్రాసినారు. వారి తాత్పర్యము- రావణాసురు డెత్తుకుపోతున్నాడు గాన రోదనమను