పుట:Sukavi-Manoranjanamu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాలుగంటిఁ జూడఁ జూడవా వనీరసాలమా
నీలవేణిఁ గానవోటు నీవు నేడు తాలమా!

444
మూడవ చరణమందు 'చూడవా' అనుచోట. 445
అచ్చుకు
రామాభ్యుదయము (5-239)
సుగంధి.

అంగనాలలామ గానవా లతాకుడుంగ మా
తంగమా భుజంగమా పతంగమా కురంగమా
లుంగమా లవంగమాతులుంగ మాధవీ నటద్
భృంగమా నీరమా కరీరమా సమీరమా!

446
'కానవా' అనుచోట. 447
ఈ పద్యమును అప్పకవిగారు సంశయ కాకుస్వరయతికి లక్ష్యము వ్రాసినారు. వృక్షాదుల నడుగుట కనపించుచున్నది గాని సంశయము లేశమైనా కనుపించదు. 448
25. ‘శ్లాఘ' అచ్చుకు
శ్రీనాథుని కాశీఖండము (1-14)
శా.

ఈ క్షోణిన్ నిను బోలు సత్కవులు వేరీ నేటి కాలంబునన్
దాక్షారామ చళుక్య భీమవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయగంధసారఘుసృణద్వైరాజ్యభారంబు న
ద్యక్షించుం గవిసార్వభౌము భవదీయ ప్రౌఢసాహిత్యముల్.

449
మొదటి చరణమందు. 450
'వేరీ' యను ఓ అపశబ్ద మనుకొని లేఖకులు 'సత్కవు లిఁకేరీ' అని దిద్దినారు. 'వేరీ' అనిన్నికలదు. మరియును ననేకశబ్దములు - ఎన్ను, వెన్ను మొదలైనవి గలవు (పంచమా)శ్వాసమునందు తెలియపరుచుతాము.451