పుట:Sukavi-Manoranjanamu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నప్సరో నికురుంబ మాటలు పాటలు
             నై వినోదింపఁగ నమరగణము
బహువిధాలంకారభంగుల విన్నాణ
             ములు సూడ దివ్యమునులు నుతింప
మనుజలోకం బెల్ల కనకాన్నవస్త్రభూ
             షణదానములఁ దృప్తి సనఁగ నశ్వ
మేధసమితిఁ జేసి మెప్పించె నింద్రుని
శతతమాధ్వరమున నతఁడు హయము
నాసపడిన నిచ్చె నా దిలీపునిఁ జూపు
మా ధరిత్రి నిపుడు మనుజనాథ.

440
చూపుమా' అనుచోట 441
అచ్చుకు
అందే (1-237)
సీ.

అనిమిషాసురయుద్ధమున సువర్ణావలి
             సమయించి వర్ణశ్రమములు నేర్ప
రించి భూమి నలంకరించి యగ్నిష్టోమ
             హయమేధ వాజపేయాతి రాత్ర
పౌండరీకములనఁ బరిగిన యధ్వర్య
             ము లనేకముల చేసి భూసురులకు
నఖిలభూములఁ గల యర్థంబు నెల్లను
             దనకని యేమియు నునుప కిచ్చె
శుక్రుఁ డల్లుఁ డనఁగ శోభిల్లెఁ దనయందు
ధర్మతత్వ మూర్జితముగ నియమ
నిష్ఠుఁడై యయాతి నెగడి శాశ్వతుఁడయ్యె
నే నృపాల యమ్మహీశ్వరుండు.

442
'అయ్యెనే' అనుచోట 443
హల్లుకు
జగ్గకవి సుభద్రాపరిణయము
సుగంధి.

జాలమేల బాలఁ జూపు సాలమా రసాలమా
తాలజాల మాలతీ లతా వృతాలి జాలమా