పుట:Sukavi-Manoranjanamu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పేదజీవన మయ్యె బిడ్డకు రాగుండె
             వాఁడవుగాన నీవా యరయవు
కాశి నెట్లున్నదో కమలాయతేక్షణ
             దర్శించి వచ్చుట తగవుగాదె
యెలనాగ పుట్టిన యింటివారలు దన్ను
             నరయ నుపేక్షించి నపుడె బెగడు
ననిన బహుసంపదలతోడ నరిగి యతఁడు
క్రతుభుగీశ్వరు పురలక్ష్మి నతిశయించు
తత్పురము సూచి శివుఁ జూచి తనయఁ జూచి
తెలసి యవ్వీట లింగప్రతిష్ఠ చేసె.

426
రెండవ చరణమందు రెండవ యతి 427
20. 'ప్రాగల్భ్యము" అచ్చుకు
శ్రీనాథుని కాశీఖండము (6-295)
చ.

అన విని పారువంబు నవయౌవనగర్వమునం బడంతి కి
ట్లను నిదియేమి నా బలపరాక్రమసంపద యింత మాత్రమే
తన సరివారికి న్వెఱచి ధామము పాడఱజేసి డాగబో
యిన సరియిళ్లవారు నగరే ఖగమో యది యేమి దయ్యమో.

428

చివర చరణమందు (ఇక) రెండవ చరణమందు నిత్యసమాసాఖండాభేదయతులు

గలవు. 429
21. 'భీతి', హల్లుకు
వసుచరిత్రము (4-103)
చ.

చెలుల మొఱంగి నాడు మణిచిత్రగృహంబున మోమువాంచి తొ
య్యలి భవదేకదర్శన మదాకృతిఁ జూచెఁగదా వినీలకుం
తల హృదయంబు నీకు విదితంబు గదా యిఁక దాపనేటికిన్
వెలది మనంఁబుఁ దెల్పగదవే మణిహారమ సారె వేడెదన్.

430