|
నో వురిలో నొక్క యుమ్మడి నింటింట
నార్తనాదములు పెక్కయ్యె నెల్ల
రవములు మిగిలి సైంధవునింటిదిక్కున
నాక్రందనధ్వను లతిశయించె
నేను ద్రోణుఁడు భీష్ముండుఁ బూని చెప్ప
శౌరి మాటలు మీరాజు సరకుగొనఁడు
సంధిగానక కర్ణుండు సౌబలుండు
దుస్ససేనుండు నందఱఁ ద్రోచికొనిరి.
| 422
|
మూడవ చరణమందు మొదటియతి 423
శ్రీనాథుని కాశీఖండము (6-88)—
సీ. |
బ్రహ్మ మానందరూపం బట్టి తథ్యంబు
నానాత్మపరికల్పనంబు మిథ్య
ముదిమి నింద్రియశక్తి మొఱవవోకుండఁగ
మైధునక్రీడ యేమఱని యురువు
సౌఖ్యార్థి యైన యాచకుని కిచ్చట పాడి
పంచభూతాంశుకప్రకృతి తనువు
యౌవనంబులు పోయెనా రావు క్రమ్మఱ
సపరిక్షయమ్ములు సంచయములు
గడచి నప్పుడు క్రిములొండెఁ గాకులొండె
గుక్కలొండేసియును భుక్తిగొనెడు దేహ
మొకఁడు ప్రార్థించి యడిగిన నొసఁగవలదె
తన్ను నిచ్చిన యది గదా దానగుణము.
| 424
|
నాలవ చరణమందు మొదటియతి 425
హల్లుకు —
అందే (6–165) —
సీ. |
ఒకనాడు మేనక యుర్వీధరేంద్రుని
యొద్దఁ గూర్మి తనూజ యునికిఁ దలఁచి
|
|