పుట:Sukavi-Manoranjanamu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చేమకూరవారి సారంగధరచరిత్రము (3.63)
మ.

తొలుతన్ రాజులు భోగకామినుల యందున్ మోహితుల్గారొ యిం
పొలయన్ వారి కపారమైనధన మీరో యందుకే మిట్లు పు
త్రుల దండింపఁగ నిచ్చువారి వినమెందున్ నేడు చిత్రాంగి మం
దులు నీకుం దలకెక్కెనో పరవశాత్ముల్ గారె కామాతురుల్.

399
ఆముక్తమాల్యద (2–66)
మ.

తరుణుల్ తల్లియొరం గుచంబులునుపం దచ్ఛైత్యముల్ దీములై
పెరరేపం జనుదెంచెఁగాక రవి దీప్తిం జెంది పాతాలగ
హ్వరమం దూరిన వారి నీ యతుకుఁ ద్రాళ్ళాతెచ్చు (నాదీర్ఘ త
చ్ఛిరకృష్టిం గను నీటిశైత్య మలరించెన్ నూతులం దత్తఱిన్).

400
రంగనాథుని రామాయణము
ద్విపద.

అట్టినామీఁద నీవా యడరెదవు
పట్టి చట్టలువాపి పాఱవైచెదను.

401
మొదటి చరణమందు. 402
16. ‘బోధకత' – హల్లుకు
జగ్గకవి సుభద్రాపరిణయము
క.

యర్జునుఁ డీ బాయనె
మాయాయతివేషమూని మసలుచునున్నాఁ
డీ యిక్కువ నీ వెఱుఁగవు
గా యొక్కింతైన మత్తకరివరయానా!

403
చివర చరణమందు 404
అచ్చుకు
మనుచరిత్రము (3-34)
చ.

ఉడుపతి బారికి న్వెఱచి యూఱటమౌనని పేరుటామనిన్
ముడవడు కంతుసేనలకు ముయ్యలగుట్టగు నట్టి యిందురా