పుట:Sukavi-Manoranjanamu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
15 'తర్కము', హల్లుకు
శ్రీనాథుని కాశీఖండము (6-273)
మ.

గయకేలా యరుగంగ మానవులకుం గాశీపురీ వాహినీ
త్రయవేణీ పులినంబు లందు నిడరాదా తల్లినిం దండ్రినిం
బ్రియమాతామహులం బితామహులనుం బేర్కొంచుఁ బిండాన్నముల్
గయికోరోటు ప్రియంబుతోడఁ బితడల్ హస్తాబ్జముల్ సాచుచున్.

392
రెండవ చరణమందు 393
తారాశశాంకవిజయము
మ.

తొలి దేవేంద్రుఁడు మాకులంబుఁ జొరలేదో మేము నార్మోము రా
యల యంకస్థితిఁ గాంచలేదొ స్వరవిద్యల్ మున్ను మావారి శి
క్షలచేఁ బాణిని నేర్వఁడో యని కులస్థానప్రతిష్ఠన్ ద్రిభం
గుల ఘోషించె ననంగఁ గోళ్లు కలయం గూసెన్ ధరామండలిన్.

394
మొదటి చరణమందు 395
శాంతిపర్వము (1-287)
మ.

అనుమానింపక తోడఁబుట్టువులఁ గాదా దున్మి దూటాడె నెం
దును క్రొన్నెత్తురు టేఱులై పఱవ నింద్రుం డుగ్రతన్ దైత్యులన్
మును లవ్వీరు భజింపరో క్రతువు లామోదంబుతో నమ్మహా
త్ముని యాజింపరొ యార్ధ్వలోక మదికాదో యేలఁడో నాకమున్.

396
చివర చరణమందు అచ్చుకు:- 397
హరిశ్చంద్రోప్యాఖ్యానము (2-147)
శా.

ఓరీ రాజకులాధమా నృపులు లేరో వేటరారో మద
క్రూరాభీలమృగావలిం దునుమరో ఘోరాటవు ల్లేవొ నా
యారామంబుఁ గలంచి జంతుతతి మాయంజేసి యస్మత్కుమా
రీరత్నంబులు వేడ వచ్చినను వారిని నొంచినావేమిరా!

398