పుట:Sukavi-Manoranjanamu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-38)
చ.

ఉరుకుచ డెంద మెంత మృదువో మరి తియ్యనితుంటవింట న
వ్విరి విరిబోవు వారినిడి వేనలి గొజ్జఁగిపూవుచేత మ
చ్చరమునఁ బొంచి చచ్చియును జావనివాఁ డవు డేసి యార్చెఁబో
సురసుర స్రుక్కి (మెత్తనగు చోటనె) గుద్దలి వాడియౌ గదా!

385
మొదటి (చరణమందు) 386
అందే (3-215)
ఉ.

ఆయెడ రాజునానతి మృగాక్షిని రజ్జు నిబద్ధఁజేసి య
న్యాయము రాకుమారు సుగుణాగ్రణి పావనశీలు నుత్తమున్
మాయలు పన్ని మచ్చరము మై మని మించెను జూడనున్న ద
న్నా యిది మేకవన్నె పులి యంచుఁ దలారులు గొంచుఁబోవఁగన్.

387
చివరి (చరణమందు) 388
14 ‘పరిహాసము', హల్లుకు
చేమకూరవారి సారంగధరచరిత్రము (1-34)
శా.

లేవే భోజన మేటికొల్ల విటు లేలే మేన బల్సొమ్ము లే
వే వేఁబూనవు వెల్లఁబాఱె మొగమేమీ రాజుతో నల్గి నా
వో వామాక్షిరొ దెల్పవే యనుగు నర్మోక్తుల్ చెలుల్ వల్కఁగా
వే విళ్లం బొదలెన్ లతాంగి పతికిన్ వేడ్కల్ కొనల్ సాఁగఁగా.

369
అచ్చుకు
మనుచరిత్రము (2–41)
ఉ.

ఇంతలు కన్నులుండఁ దెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర యే
కాంతము నందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతయ కాక నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు, నీ
కింత భయమ్ములే కడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్.

390
మూడవ చరణమందు 391