పుట:Sukavi-Manoranjanamu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వో వామాక్షిరొ తెల్పవే యనుచు గర్భోక్తుల్ చెలు ల్వల్కఁగా
వేవిళ్లం బొరలెన్ లతాంగి పతికిన్ వేడ్కల్ కొనల్సాఁగఁగన్)

364
మొదటి చరణమందు. 365
అచ్చుకు
వసుచరిత్రము (4-78)
శా.

ఏమే హేమలతా యటంచుఁ బనియేమే మాధవీ యంచు, నీ
భామా మన్మథుచంద మే మనుచుఁ జెప్పంజాల భూపాలుఁడా
రామక్షోణికిఁ జిన్ననాటగొలె నిద్రాసౌఖ్యము ల్మానినాఁ
డేమో యంచు వచింప వింటిఁ దమలో నేకాంతలీలాగతిన్.

366
మొదటి చరణమందు 'గొలె' యని హ్రస్వమున్ను గలదు. 367
శ్రీనాథుని నైషధము (7-19)
శా.

ఏమో క్రొత్తయపూర్వవార్త విను చేమీ చెప్పుచుం దండనా
థామాత్యాదులు పాదచారమున సేవాసక్తిమైఁ గొల్వఁగా
భూమీశాగ్రణి సొచ్చెఁ బట్టణము సంపూర్ణానురాగంబుతో
భామానేత్రచకోరచుంబితముఖప్రాలేయరుగ్బింబుఁడై.

368
(ఈ పద్యము మొదటి చరణము) అన్ని పుస్తకములందు 'వినుచేమో జెప్పుచున్' అని యున్నది. యతి భంగమైనది ఈ తప్పు పాఠముకే పండితు లర్థమును చెప్పుతారు. ఆ అర్థమున్ను తప్పు పాఠముకు కుదురదు. మొదట విమర్శ లేనివారికి నర్థవిమర్శ మాత్రమెటుల కలుగునుః 369
దమయంతీవివాహానంతరము నలమహారాజు స్వపురప్రవేశసమయమందలి పద్య (మిది) 'ఏమో నూతన వార్త వినుచు 'ఏమీ' అని రాజు ప్రశ్న చేసిన పిమ్మట (మరలనేమో) చెప్పుచు సరదారులు, మంత్రులు మొదలయినవారు పాదచారులయి—' మీద సులభమే. దండనాథామాత్య ప్రధానమంత్రి శబ్దములు నియోగులకు పేరులవును. దండనాథు లనఁగా యుద్ధసన్నద్ధులకు రూఢి