పుట:Sukavi-Manoranjanamu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గావున పునరుక్తి దోషము లేదు. వార్తలు వినునపుడు 'ఏమీ' అనుట సామంతులకు స్వభావమే గావున నాశబ్దముంచుట ముఖ్యమే. 370
చేమకూరవారి విజయవిలాసము (3-31)
ఉ.

ఎవ్వనిఁ జూచి మేలుపడితే యరవిందదలాక్షి, నీ మనం
బెవ్వఁడు వచ్చుఁ జెప్పఁ గదవే మదకోకిల వాణి, నిన్న నే
డెవ్వని చెల్వు నీ యెదుట నెన్నఁబడెన్ లతాంగి, నేనకా
కెవ్వరు నీకు ప్రాణపద మేటికి దాచెదవే తలోదరీ.

371
ప్రథమ, ద్వితీయ చరణములందు. 372
12. ‘ప్రార్థన', హల్లుకు
ద్రోణపర్వము (2-379)
క.

మునినాథ దేవకీసుతుఁ
డును సంక్రందనతనూజుఁడుం బూనిన యా
పని యెమ్మెయిఁ గడతేఱెనొ
వినవలతుం దేటపరుపవే పరిపాటిన్.

373
కర్ణపర్వము (1-246)
చ.

గురుఁడును భీష్ముఁడుం బడినఁ గొంచెపుమూఁకలతోడ నేను సం
గరవిజయంబు గోరి భుజగర్వమునన్ సడిసన్న పాండుభూ
వరసుతవర్గముం దొడరు వాఁడనకా మది నిశ్చయించు టె
వ్వరిఁగొని యింత నీ వెఱుఁగవా నిను గర్ణునిఁ గాదె నమ్మితిన్.

374
శాంతిపర్వము (6–27)
క.

అనుపమ మజర మతీంద్రియ
మనామయ మనంత మమల మన వెలుఁగు నొకం
డని వేదశాస్త్రములచే
వినియుండుదు దానిఁ దెలుపవే కృప నాకున్.

375