పుట:Sukavi-Manoranjanamu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మొదట చరణమందు 357
పారిజాతాపహరణము (1-123)
చ.

నను భవదీయదాసుని మనంబున నెయ్యపుటల్క దోచి తా
చినయది నాకు మన్ననయ చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము నాటిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవుగదా యికనైన మదాలికుంతలా.

358
చివర చరణమందు. 359
శశిబిందుచరిత్ర
ఉ.

పయ్యెద బాపి గుబ్బలను బాహులఁ బట్టఁగ నిచ్చి మోవిపై
తియ్యని మోవియు న్మనసు దీరఁగఁ గ్రోలఁగ నిచ్చి యిప్పుడో
తొయ్యలి నీవి ముట్టినను ద్రోచెద వేనుఁగు నిచ్చి యంకుశం
బియ్యక కయ్యమాడ దగునే నను నీగతి వేచఁ బాడియే.

360
చివర చరణమందు 361
ఉభయముకు
తిమ్మకవి
చ.

కటకట యిప్పు డింత యలుకా యులుకా బలుకానలోన న
న్నటమట నొందఁజేయఁదగవా మగువా పగవాఁడనె యింక నె
న్నటికి నిన్నుఁ బాయఁగలనా లలనా వలనా కలంచ నే
నెటువలె తాళువాఁడ వలతీ పొలతి కలతీరు తెల్పుమా.

362
నాలుగు చరణము లందున్ను. 363
11. 'ప్రశ్న'. హల్లుకు
చేమకూరి వారి సారంగధరచరిత్రము (1-34)
శా.

లేవే భోజనమేటి కొల్ల విటు లేలే మేన బల్సొమ్ము లే
వే వేఁ బూనవు (వెల్లఁబాఱె మొగమేమీ రాజుతో నల్గి నా