పుట:Sukavi-Manoranjanamu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
హల్లుకు
చేమకూర వారి విజయవిలాసము (అవ 20)
ఉ.

శైలము చెక్కి యష్టమద సామజమౌలుల మీఁదుగా మహా
కోల కులేంద్రు దాటి బలుగొమ్ము మొనం బడి సర్వదా విష
జ్వాలలు గ్రమ్ము శేషువుని చాయనె యోడకవచ్చి కూడె నౌ
భూలలితాంగి కెంత వలపో రఘునాథ నృపాలునందునన్.

269
'వలపో' అను చోట.270
మరియు నందే (1-16)
సీ.

నీ తృణముఁ జేయు నెంతే వాని నైన నీ
             నీలంపు ముంగర నీలవేణి...

271
'ఎంతటి వాని' నని ప్రతి పుస్తకమునందున్నది. యతిభంగము కానరు. 272
పూర్వలాక్షణికులు నిర్ణయించిన భీతి, శోక, తర్క, గీత, దూరాహ్వాన, సంశయ, ప్రశ్న— ఈ యర్థములలో నొకటియు నిచ్చట కనుపించదు. హల్లులు ప్రధానమైనచోట వర్గయతి మొదలైనవి చెప్పవచ్చును. అచ్చులు ప్రధానమైనచోట మరియొక యతి చెప్పవల్ల లేదు, గాన నేను నిర్ణయించిన 'యమిత' మను కాకుస్వరయతి చెప్పు టొప్పగును. 273
2. 'నిబోధము' కు, హల్లుకు
చేమకూర వారి విజయవిలాసము (1-199)
శా.

చెండ్లా గుబ్బలు జాళువా తళుకులా చెక్కిళ్లు డాల్ సింగిణీ
విండ్లా కన్బొమ లింద్రనీలమణులా వేణీరుచుల్ దమ్మిలేఁ
దూండ్లా బాహువు లింతచక్కదన మెందుంగాన మీజవ్వనిం
బెండ్లాడం గలవాఁడు చేసినది సుమ్మీ భాగ్య మూహింపఁగన్.

274
'సుమ్మీ' అనుచోట. ఇది బిందుయతి యనరాదు. అందఱును బిందుయతి యని చెప్పినారు. 275