పుట:Sukavi-Manoranjanamu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యక పఙ్క్తుల్ నడచున్ సహస్రములుగా నయ్యారె వివ్వచ్చు చే
తికి కన్నుల్ గలవంచు నెంచి రపు డెంతే యోధవీరాగ్రణుల్.

261
ఇవి వర్గయతు లనుకొందురు. 262
అచ్చుకు
కృష్ణరాయల ఆముక్తమాల్యద (4-107)
ఉ.

సారెకు మింట మేఘుఁడు నిజస్ఫురణం ఒఱఁ గ్రూరమౌ పురోం
గారక యోగ మూఁది తిరుగన్ సకుటుంబము తద్గృహంబు నెం
తే రుషఁ ద్రొబ్బ నంతలును నింతలునై పడు తన్నభశ్చ్యుతాం
గార శిశు ప్రతానముల కైవడి రాలెను నింద్రగోపముల్.

263
ఇక్కడ నఖండయతి గాదు. 'అమిత' మను కాకుస్వరయతి చెప్పవలె. రెండవ నాల్గవ చరణములందు నిత్యసమాసయతులు గాని, వర్గయతులు గావు. 264
అందే (4–112)
స్రగ్ధర.

గ్రావాలం గేతకీ కోరకకుటజరజో రాజి దూర్వాంకురశ్రీ
తో వీక్షింపం దినాను త్రుటి మఱుపడుచుం దోచు నిట్లే విరోధా
నావిర్భావంబులన్ బాయక పొరయు నభస్యాభ్రమల్ గప్పె నెం
తే విప్పై పింఛికల్ బర్హణులు దిరుగఁబెల్లింద్రజాలంబు సూపెన్.

265
నాలవ చరణమందు రెండు చోట్లను స్వరమున్నందున 'నమిత' మను కాకుస్వరయతి నంగీకరించక విధిలేదు. 266
కవి ధూర్జటిగారి కాళహస్తీశ్వరశతకము
మ.

అతిదుర్గంధము మూత్రపూరితము నేహ్యంబున్ మహారోమసం
యుతమౌ బెత్తెఁడు యోని జూచి నరు లెంతో మోహవిభ్రాంతులై
మతి నూహించి సురేంద్రభోగ మనుచున్ మానంగలే రెంతయున్
క్షితిలో మూఢు లదెట్టి చోద్య మహహా శ్రీకాళహస్తీశ్వరా!

267
'ఎంతో' అనుచోట. 268