పుట:Sukavi-Manoranjanamu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆదిపర్వము (2-219) నందు
క.

ప్రస్తుత ఫణిసత్రభయ
త్రస్తాత్ములమైన యస్మదాదులకెల్లన్
స్వస్తియని వలుక నవసర
మాస్తీకున కయ్యె నిప్పు డంబుజనేత్రా!

అధర్వణాచార్యుల విరాటపర్వమునందు
గీ.

ధర్మతనయ యుష్మదాజ్ఞానిగళ విని
బద్దమగుచుఁ జిక్కువడియెఁగాక
విజయ మత్తగజము విడివడ్డచో నడ్డ
పాటు గలదె విష్టపత్రయమున."

156
అని వ్రాసినారు. ఈ రెండు నఖండయతులు. అయితే అప్పకవిగా రఖండయతి నొప్పరు గాన, ఇచ్చట దిద్దశక్యముగాక 'యుష్మదస్మచ్ఛబ్ద'యతులని పేరుంచినారు. ఇంత మాత్రము చేత నఖండయతికి లోపము రానేరదని యుంచినాము. 157

15. ఘఞ్ యతి

లక్షణము
లక్షణసారము
గీ.

అచ్చు హల్లును తాపశబ్దాది వర్ణ
మునకుఁ జెప్పిన ఘఞ్ యతులనఁగఁ దనరు
నంబురుహగేహిని మధురాలాపయనఁగ
లక్ష్మి వాగ్జిత కోకిలాలాపయనఁగ.

158
లక్ష్యములు
ఉభయముకు
రంగరాట్ఛందము (3-233)
క.

శ్రీ పరిఢవిల్ల సత్యా
లాపవిలాసియగు కృష్ణు నటువలె రంగ