పుట:Sukavi-Manoranjanamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అరణ్యపర్వము (7–367)
చ.

ఎఱిఁగితి నిన్ను నేను విబుధేంద్రుఁడ వీవు జగత్త్రయంబు క్ర
చ్చఱ భవదీయరక్షణము నంద వెలుంగుచు నుండె నట్టి ని
న్నుఱవుగ నేను వేడుకొన నొప్పునుగాక మొఱంగి నిన్ను న
క్కఱపడి నీవు వేడుటిది కర్జమె నిర్జితదైత్య చెప్పుమా!

108
అచ్చుకు
పారిజాతాపహరణము (1-49)

(ప్రామినుకులదొంగఁ బాతాలకుహరంబుఁ
             జొరఁబాఱి చీఱిన చోఱ వీవ
తరిగొండ వెన్నుపైఁ దాల్చి వేల్పుల గూటి
             చవి దేల్చినట్టి కచ్ఛపమ వీవ
నీటిలో మునిఁగిన నేలచేడియఁ గొమ్ము
             కొన నుబ్బ నెత్తిన ఘోణి వీవ)
మునిమాపు బలుగంబమునఁ బుట్టి బంటు న
             క్కఱను బ్రోచి నృసింహంబ వీవ...

109
కొందఱు విశ్రమభంగ మనుకొని ('అక్కఱను' అను దానిని) 'నెయ్యమున' అని దిద్దినారు. (వారు) స్ఫూర్తిగా విశ్రమములు తెలియనివారు 110
'ఓలమాస' - హల్లుకు
అనుశాసనికపర్వము (1-68)

అతిథి నినుగోరె నేనియు
మతి కింకిరి పడక నోల మాసగొనక నీ
వతనికిఁ బ్రియంబు సలుపుము
సతికిం బతి పనుపు సేయఁ జను నెల్లవియున్.

111