పుట:Sukavi-Manoranjanamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దర్శనం బిచ్చె మత్పయోధరము లింత
లేసి కలవని తెలిపెడు లీల దోఁప.

33
అచ్చుకు
శ్రీనాథుని కాశీఖండము (2-104)
గీ.

అప్పటికి నియ్యఁగొంటిఁగా కబ్జవదన
ఋషుల పాలిటివే యింతలేసి పనులు
కొదుగ కాబోతు నాబోతు క్రుమ్ములాఁడ
నడిమి యాబెయ్యదెస వచ్చె నాకు నిపుడు.

34

6. భిన్నయతి[1]

(కాకునూరి అప్పకవిగారి లక్షణము)
గీ.

గుడుసుపైఁ గ్రియనడుము నా గుడుసు వచ్చి
భిన్నయతి యగు రానిచోఁ బెఱయతియగు
నెదను లచ్చిని హరి ధరియించె ననఁగ
రిపుల నెల్లను బోర హరించె ననఁగ.

34/1
విజయవిలాసము (3.15)
ఉ.

చిత్తజుఁడల్లి తూపుమొన చేసినఁ జేయఁగ నిమ్ము పై ధ్వజం
బెత్తిన నెత్తనిమ్ము వచియించెదఁ గల్గినమాట గట్టిగా

  1. 'భిన్నయతి'ని వేంకటరాయడు ఉభయయతులలో పరిగణించినాడు. (చూ. 2 అ. 25 ప.) కాని దానికి ఇక్కడ లక్ష్య లక్షణములు చూపలేదు. మూలతాళపత్రప్రతులు రెండింటియందు నెక్కడను ఈ యతి వివరణ లేదు. 'ఇ' ప్రతియందు మాత్రము వికల్పయతి ప్రదర్శన తరువాత, 'రాగమసంధియతి వివరణకు మొదట 'భిన్నయతికి లక్షణము సీ॥ ధరియించె భరియించె వరియించె సుఖియించె' అని మాత్రము కుండలీకరణములో వ్రాయబడియున్నది. గాని ఈ లక్షణపద్యము పూర్తిచేసి లక్ష్యము లెక్కడను ప్రదర్శింపబడలేదు. అందువలన గ్రంథసమగ్రతకొరకు అప్పకవీయము నుండి ఈ యతికి లక్ష్య లక్షణములు చూపబడుచున్నవి.