పుట:Sukavi-Manoranjanamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబుపైఁ జల్ల ద
రకబాణంబులకెల్ల నెల్లయగు సౌభాగ్యంబు శోభిల్లఁగన్.

17
మనుచరిత్రము (2-16)
మ.

అకలంకౌషధసత్వముం దెలియ మాయాద్వారకావంతి కా
శి కురుక్షేత్ర గయాప్రయాగములు నే సేవింప కుద్దండ గం
డక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్ర మిమ్మంచుఁగొం
డకు రాజెల్లునె బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్.

18

(ఈ పద్యమును) వికల్పసంధి యతికి అప్పకవిగారు (లక్ష్యముగా) వ్రాసినారు.

అనునాసికయతికి మిగిలిన లాక్షణికులు వ్రాసినారు. రెండు ననవచ్చును. 19
పై మూడువిధములైన యతిభేదములు వ్యంజనవిషయికము లయినప్పటికి సంధివర్ణమైన ద్విత్వా(సంయుక్తా)క్షరపు రెండువిధములైన హల్లులకు యతి చెల్లుటవలన ఉభయ యతులందు నుంచినాము. 20

4. రాగమసంధియతి

లక్షణము
కాకునూరి అప్పకవిగారి 'ఆంధ్రశబ్దచింతామణి': (3-215)
గీ.

ఆలను పదంబు మొదలను రాగమంబు
వచ్చుసంధికి నుభయంబు వలి తనర్చు
నతివ జవరాలు బాలింతరాలు ముద్ద
రాలు ధర్మాత్మురాలన రాక్షసారి.

21
ఉభయముకు లక్ష్యములున్నవి.
లక్ష్యములు, హల్లుకు

 :

చారుధేష్ణచరిత్రము
క.

ఈలలన వేలుపుం జవ
రాలో యచ్చరయొ కిన్నరవధూమణియో