పుట:Sukavi-Manoranjanamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

'వేదముఖమున వబయో రభేద యనుట
వలన వబ లొక్కటొకటికి నిలుచు విరతి
కవని ల డ లకు ల ళ లకు నట్ల కలిమిఁ
జేసి తమలోన నవియును జెల్లుచుండు'

290
అని లక్షణము చెప్పి :
గీ.

వసుమతీ కలత్ర బకజైత్ర గానక
లా లసత్కలాప డంబ గోప
లలితదేహ పింగళపుర దక్షిణ గేహ
యన నభేద నిరతు లప్రమేయ

291
అని లక్ష్యములు చెప్పి, అనంతుని ఛందమునందు ల డ లకు లక్ష్యము వ్రాసిన :-
క.

కాకుస్వరయతి యగు నితఁ
డే కదలక జలధిఁ బవ్వళించె ననం బ్ర
శ్నా కలిత దీర్ఘమున నితఁ
డే కవ్వడి రథము గడిపె నిమ్ముల ననఁగన్.

292
అను పద్యము వ్రాసినారు. (అయితే) పవ్వళించె, పవ్వడించె అని రెండువిధములు గలదు. ఆంధ్రనామసంగ్రహమునందు :-
'గీ.

ఒప్పు శయనించె ననుట తొన్నుండెఁ బండె
పవ్వళించెఁ బరుండెను బవ్వడించె... '

293
అని యున్నది. రేఖా, లేదా అని (రెండు విధములు) ఉన్నందున ర లల కభేదము కూడదని (అప్పకవిగారు) వ్రాసిరి. ఇక్కడ మాత్రము తత్పాండిత్యమహిమ ఏమయిపోయెనో తెలియదు. ర ల లకు బహులములు లక్ష్యములు గలవు (కాని), లడలకు నొకటియు లేదాయెను. ఉన్నవి కొట్టివేయుటకు, లేనివి నిలుపుటకు (వారు) స్వతంత్రులు.294