పుట:Sukavi-Manoranjanamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కొందఱు లాక్షణికులు ద డ లకు నభేద మొప్పక ఈ పద్యమందు దొప్ప–డొప్ప అని రెండువిధములు గలవు గనుక, 'డొప్ప చెవులు' అన్నారు. 286
శ్రీనాథుని కాశీఖండము (7-80)
సీ.

వదనంబు దెఱచి మ్రింగుదునె బ్రహ్మాండంబు
             బలు మోపకుండఁగ బాండు రాంగ
పిండి పీచంబుగా పృథివీధరంబులఁ
             దంతునే కాలదండమున నభవ
దందశూకాధీశు తలలు దండ సిలంగఁ
             దాటింతునే కాల ధర మహేశ
వచ్చి వైతునె కేలి వాలారు నఖముల
             నఖిలదిక్కులు శశాంకార్ధమకుట
యేమి సేయుదు నానతి యిమ్ము నాకు
ననుచుఁ గ్రమ్మఱ మ్రొక్కె బాహప్పళించి
తన్మహాధ్వనిఁ కలిఁగి యుత్కటము లగుచు
జలధు లేడును ఘూర్ణిల్ల శంభుసుతుఁడు.

287
(ఇందు) దంచుటను డంచుట అని దిద్దలేదు. ఏమి హేతువునో తెలియదు. 'బాహువు'లో ఉకార లోపము. (ఇక) కవిత్రయమువారి లక్ష్యము లేదని కొందఱు (అందురు. ఉన్నది.)288
అనుశాసనికపర్వము (4-17)
గీ.

దైవతార్చలపుడు డాకినీభూతర
క్షోముఖంబులైన కుత్సితంపు
జాతులెల్ల దీపసన్నిధి నణఁగు, న
ట్లగుట దీపదాన మధికఫలము.

289
ల ళ లకు (ప్రయోగములు) బహులములు గలవు. (ఇక) కాకునూరి అప్పకవిగారు 'ఆంధ్రశబ్దచింతామణి' యందు అభేదయతులకు :-