పుట:Sukavi-Manoranjanamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యని యిట్లు సంస్కృత వ్యాహార మధ్యావ
             సానంబులు ద్వితీయ సరలమునకు
నడుగున గల తాలుజానునాసికములు
             తద్భవంబున ద్రుతత్వంబు నొంది
వెలయుటను తద్భవవ్యాజవిశ్రమమున
జరిగి నణలకు రెంటికి జ్ఞా తనర్చు
జ్ఞాని చేతోంబుజాత శోణకర యనఁగ
జ్ఞాతి విద్వేషి నృపనాశనకర యనఁగ.

261
ఈ పద్యము రెండవచరణ మందు సకారముకు, గీతపద్య ద్వితీయచరణమందు జకారమునకు జ్ఞకారము విశ్రమ ముంచినారు. మొదట సరసయతి. తరువాత వర్గయతి. బిందువు లేకుండగ తమరే ప్రయోగించిరి. బిందుయతులందు సున్న ఉంటే కాని చెల్లదనిరి. (అప్పకవిగారు) స్వసిద్ధాంతవ్యాఘాతము కానరైరి. (ఇక)262
లక్ష్యములు
పావులూరి మల్లన గణితము
ఉ.

శ్రీనిధియైన శివ్వనను జిమ్మననున్ మఱి సూర్యదేవునిన్
దీనిధి పోలనార్యులను దేజమునన్ రవితుల్యులైన యా
సూనులు నల్వురం బడసె సూరి జనస్తుత సత్య భారతీ
జ్ఞానులఁ బద్మగర్భవదనంబులు నాలుగు పోలువారిలోన్.

263
రుక్మాంగదచరిత్రము (2-63)
క.

శ్వానమునకుఁ జండాలున
కైనను నాకొన్న నిడఁగ నగు నన్నము దు
ర్మానసుఁడై పెట్టక య
జ్ఞానంబునఁ గడపెనేని నరకమునఁ బడున్.

264