ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆముక్తమాల్యదకు వ్యాఖ్యానకర్తలు 'కుయివెట్టన్ వెళ్ళు = మొఱపెట్టుకొనుటకు వెళ్లు...' అని అర్థము వ్రాసినారు విశ్రమభంగము కానలేదు. అర్థమున్ను కుదరలేదు. 'కుయి = మొఱతో, వెంటనే వెళ్లు = కూడా వెళ్లుతున్న' అని చెప్పితే, యతి భంగము కాదు అర్థమున్ను సందర్భముగా నున్నది. లోకమునందు సొమ్ము దొంగలు పట్టుకుపోవుచుఁడగా మొఱపెట్టుట ప్రత్యక్షమే. వ్యాఖ్యాకారులు 'సూర్యునివద్దకు మొఱపెట్టుటకు వెళుతున్న' వనుట 'పరిశీలించని యర్ధ' మని వ్రాయనక్కరలేదు. కుకవుల నాదరించక, సుకవులకు గౌరవము కలుగు నప్పటికాలముందే ఈ పరిశీలించులు లేకపోయినది. వినిమయము గలుగు నిప్పటికాలమందు ఇటుల జెప్పుట ఆశ్చర్యము కాదు. ఇప్పటికవులకు తప్పున్నదే తోచలేదు. 'ఇంత తప్పు ఎవరికి నెందుకు తోచదాయె' ననరాదు. భగవన్మాయచే సత్య మసత్య మసత్యము సత్యము ఎటులైనదో, మూఢత్వముచే నిదియు నటులనైనది. ఇటువంటి కల్పనగల పద్యము కట్టవరపు చిట్టం రాజుగారి ద్వాదశరాజచరిత్రయందు— 259
చ. | అపుడు సమీరచోరుఁడు గవాక్షపుఁ గన్నపుగండి దూఱి ర | 260 |
అని ఉన్నది. ఈ పద్యమందు స్పష్టమే. మూడవచరణ మందు నిత్యసంధి యతి.
11. తత్భవవ్యాజయతి
లక్షణము—
కాకనూరి అప్పకవి గారి 'ఆంధ్రశబ్దచింతామణి' (3-64) —
సీ. | విజ్ఞానమునకు భావింప విన్నాణంబు | |