పుట:Sukavi-Manoranjanamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ట ఠ డ ఢ లు నాలుగున్ను, త థ ద ధ లు నాలుగున్ను దాపల పూర్ణబిందులు గలిగి పరస్పరము యతి చెల్లును. 254
టలకు—
మనుచరిత్రము (1-55)
శా.

శీలంబుం, గులమున్‌, శమంబు, దమముం, జెల్వంబు లేఁబ్రాయమున్
బోలం జూచి యితండె పాత్రుఁ డని యే భూపాలుఁ డీ వచ్చినన్‌
సాలగ్రామము మున్నుగాఁ గొనఁడు మాన్యక్షేత్రముల్‌ పెక్కు చం
దాలం బండు నొకప్పుడుం దఱుఁగ దింటం బాఁడియున్‌ బంటయున్‌.

255

'చందాలు' అని చోట (చందములు) ముకారము పోయి ఉకారమునకు

దీర్ఘము వచ్చినది. 256
కృష్ణరాయల ఆముక్తమాల్యద
మ.

పురి నేగించి తదీయమైన నగరంబుం జేర్పుడంచుం బడిం
దొరలన్ రాజకుమారులన్ బనుపఁగాఁ దూర్యస్వనంబుల్ నిరం
తరవందిస్తుతులుం గజేంద్రహయఘంటావారకాంతాంఘ్రినూ
పురముల్ మ్రోయఁగఁ గొల్చి దారిరుగడిన్ బో మార్గమధ్యంబునన్.

257
అందే
మ.

దవధూమంపుఁ దమంబులోఁ దమ రసద్రవ్యంబుఁ బంకేజబాం
ధవభానుప్రతతుల్ హరింపఁ గుయి వెంటన్ వెళ్లు శూన్యోరు కూ
పవితానంబుల జాడఁ జూడఁ బుడమిం బాటిల్లెఁ బైవిప్పులై
యవసం బంచుల నాడఁగా నెగయు వాత్యాలిన్ రజశ్చక్రముల్.

258
ఈ పద్య మప్పకవీయముందు నచ్చువుస్తకమునఁదు '....కుయివెట్టన్ వెళ్లు...' అని టకారమునకు దాపల బిందువు లేకుండగ వ్రాసినారు. పొరపాటున వ్రాసినా రనుకోరాదు. తప్పులు పరిశీలించి ఒప్పులు వ్రాసిన వాటిలో ఇది వ్రాయలేదు. అనుస్వారసఁబంధయతికి లక్ష్యము వ్రాసిరి (గదా:). ఒకచోట (బిందు) స బంధము లేకపోతే విశ్రమ మేమనుకొనిరో, తెలియదు.