ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ట ఠ డ ఢ లు నాలుగున్ను, త థ ద ధ లు నాలుగున్ను దాపల పూర్ణబిందులు గలిగి పరస్పరము యతి చెల్లును. 254
టలకు—
మనుచరిత్రము (1-55) —
శా. | శీలంబుం, గులమున్, శమంబు, దమముం, జెల్వంబు లేఁబ్రాయమున్ | 255 |
'చందాలు' అని చోట (చందములు) ముకారము పోయి ఉకారమునకు
దీర్ఘము వచ్చినది. 256
కృష్ణరాయల ఆముక్తమాల్యద —
మ. | పురి నేగించి తదీయమైన నగరంబుం జేర్పుడంచుం బడిం | 257 |
అందే —
మ. | దవధూమంపుఁ దమంబులోఁ దమ రసద్రవ్యంబుఁ బంకేజబాం | 258 |
ఈ పద్య మప్పకవీయముందు నచ్చువుస్తకమునఁదు '....కుయివెట్టన్ వెళ్లు...' అని టకారమునకు దాపల బిందువు లేకుండగ వ్రాసినారు. పొరపాటున వ్రాసినా రనుకోరాదు. తప్పులు పరిశీలించి ఒప్పులు వ్రాసిన వాటిలో ఇది వ్రాయలేదు. అనుస్వారసఁబంధయతికి లక్ష్యము వ్రాసిరి (గదా:). ఒకచోట (బిందు) స బంధము లేకపోతే విశ్రమ మేమనుకొనిరో, తెలియదు.