పుట:Sukavi-Manoranjanamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీనాథుని కాశీఖండము (7-115)
సీ.

వసియింప వలయు యావజ్జీద మనురక్తి
             పరత వారాణసీపట్టణమున
చక్రపుష్కరిణి నిచ్చలు తీర్థమాడంగ
             వలయు సంకల్పపూర్వకముగాఁగ
నర్చింపవలయు గంధాక్షతంబుల పుష్ప
             ఫలపత్రముల విశ్వపతి మహేశు
నిలుపంగవలయును నెరసు వాటిలకుండ
             నాత్మధర్మస్వవర్ణాశ్రమముల
స్త్నానమహిమంబు భక్తితాత్పర్యగరిమ
వినఁగవలయుఁ బురాణార్ధవిదుల వలనఁ
దన యథాశక్తి వలయును దానమిడఁగ
కాశిఁ గైవల్య మింటింటఁగాని లేదు.

206
రుక్మాంగదచరిత్రము (1-95)
ఉ.

స్నానము చేసి భౌతపరిధానములం ధరియించి యంటగాఁ
గాని మనుష్యులం గనక కల్లలు వల్కక నుగ్రకృత్యముల్
మాని వినిద్రుఁడై నియమమానసుఁడై తమలంబు దక్కి శ్రీ
జాని పురాణముల్ వినుట సంగతి శ్రీహరివాసరంబునన్.

207
ఈ రెండు పద్యములందు అచ్చుపుస్తకములందు తకారము వ్రాయలేదు... విశ్రమ మేమనుకొనిరో తెలియదు. 208
హరిశ్చంద్రోపాఖ్యానము (4–18)
శా.

తాత్పర్యంబున జాహ్నవీజలములన్ స్త్నానంబు గావించి తా
హృత్పీఠంబున భక్తి నివ్వటిల విశ్వేశున్ మహాదేవునిన్
బత్పంకేజ నతామరున్ గిరిసుతా ప్రాణేశుఁ బూజించు సం
విత్సారీణుల కబ్బు నెల్లపుడు తన్వీ ముక్తిసామ్రాజ్యముల్.

209
చివర (పాదమున) గాన ప్లుతయతి.