పుట:Sukavi-Manoranjanamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నగధరాయ నమోస్తు సౌందర్యవిజిత
మనసిజాతాయ గోపదింభాయ యనఁగ)

192
అని అప్పకవిగారు (ఆంధ్రశబ్దచింతానుణి 3-53) చెప్పినారు. బిందువు లేకుండగనే చ ఛ జ ఝ లకు జ్ఞ వర్ణము (యతి) చెల్లుచుండగా, బిందువు చేర్చుట వ్యర్థము. జ్ఞ కారముకు చకారము (యతి చెల్లుటకు లక్ష్యము)—
వసుచరిత్రము (3-101)

ఆతన్వంగి యనంగ ఝాంకరణవజ్జ్యాముక్తనారాచని
ర్ఘాతం బోర్వక తమ్ములంచుఁ దటినీగర్భైకసంజాతకం
జాతవ్రాతము మాటు చెందనని యేచం జాగె మున్మున్నుగా,
‘జ్ఞాతిశ్చేదనలేన కి’మ్మనెడు వాచారూఢి సత్యమ్ముగన్.

193
(మఱియు) జ్ఞకారముకు శషసలు సరసయతి (గా) చెల్లును. లక్ష్యము—
ఆదిపర్వము (1-157)
ఉ.

భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టినతోడనె పుట్టు నుత్తమ
జ్ఞానము సర్వభూతహితసంహితబుద్ధియుఁ జిత్తశాంతియున్
మానమదప్రహారము సమత్వము సంతతవేదవిద్యను
ష్ఠా్నము సత్యవాక్యము దృఢవ్రతముం గరుణాపరత్వమున్.

194
ఇటువలె మహాకవి ప్రయోగములుండగా, అప్పకవిగారు 'ఆంధ్రశబ్దచింతామణి'యందు —
క.

పనిఁ బూని నిలుచుఁ దమ తమ
యనునాసికములకు బిందుయతులను వెనుకన్
గనుపట్టు నాల్గు లిపులును
బెనుసున్నలు డాసి తమకుఁ బిఱుదఁ గదియుచోన్.

195
అని లక్షణము చెప్పినారు. జకార, ఞకారములు కలుసుకుని జ్ఞా యైనది. జకారము ద్వితీయవర్గాక్షరము గావున లక్ష్యమున్ను బాగులేదు. ప్రథమ