ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(అని లక్ష్యములు వ్రాసిన ఈ పద్యములకు) కవిత్రయము వారికి పూర్వమహాకవియైన భీమకవిగారు రచించిన లక్షణగ్రంథ) మందలి పద్యములని వాడుక కలదు.
భారత భాగవత రామాయణాది మహాకావ్య లక్ష్యములు డెబ్బదినాలుగు వ్రాసినాము. ఇక్కడికే గ్రంథవిస్తర మైనందున నఖండవడిని గురించి గ్రంథము నిలిపి ప్రకృతము ననుసరించుతున్నాము. 1883. బిందుయతి (అనుస్వారయతి)
లక్షణము—
తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహము (2-152) —
గీ. | వరుస టతప వర్ణ చతుష్కము | 189 |
లక్ష్యము—
గీ. | ణాకు వడిచెల్లు కనకమండప మనంగ | 190 |
'జ్ఞాకు వడిచెల్లు రత్నకంకణ మనంగ' అని కొందఱు లాక్షణికులు ప్రథమవర్గముకు లక్ష్యము వ్రాసినారు. (కాని) బిందువు లేకుండగనే జ్ఞకార - కకారములకు యతి చెల్లుచుండగా బిందువుతో పనిలేదు. 191
| 'జ్ఞాన వేద్యాయ తప్తకాంచన విభూష | |