పుట:Sukavi-Manoranjanamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉపసర్గ సంధివడికి లక్ష్యము వ్రాసినారు, అనేక లక్ష్యము లుండఁగా, తమకు విరోధమైన ఈ పద్యము నుదహరించి నందున ఛాందసత్వముకు సంతోషించినాము. 130
ఇటువలెనే దిద్దినవి మరియును గలవు. భారతమందు దిద్దినవి 3, రామాయణమందు దిద్దినవి 2 (పైన చూపినాము.) ఆయన దిద్దుటకు శక్యము కాకనో, లేక చూడకనో దిగనాడిన పద్యములు నన్నయభట్టు గారివి, ప్రెగడగారివి, సోమయాజిగారివి అనేకములు గలవు. వ్రాసుతున్నాము. 131
ఆదిపర్వము (5-134)
ఉ.

వీరలు దైవశక్తిఁ బ్రభవించినవా రనుటేమి [1]సందియం
బీ రమణీయకాంతి నుపమింపఁగ శిల్పులెగాక యిట్టియా
కారవిశేషసంపద ప్రకాశితతేజము పేర్మిఁజూడ సా
ధారణమర్త్యులే యని ముదంబునఁ జేరుట తమ్ముఁ జూడఁగన్.

132
  1. "....సందియం
    బే, రమణీయ కాంతి నుమమింపఁగ ..." అని వ్రాతప్రతులలో గనుపించు నొకపాఠాంతరమని శ్రీ చిలుకూరి నారాయణరావుగారు 'నన్నయ యతులు' అను వ్యాసమున (భారతి జూన్ 1927) వ్రాసినారు. అప్పుడిది బిందుయతి యగును గాని యఖండయతి కాదు.
    "ఉదయించిన.." "కాంతిని వహింపగ..." అని ఉ. వి. వ. ప్రతియందు పాఠాంతరములు చూపబడినవి. 'మరియు ఈ పద్యము ప్రథమ ద్వితీయ చరణములలో 'నిత్య సమాసవడి'

    'పదము విభజించి చెప్పఁ జొప్పడని యదియు
    నన్యశబ్దంబు గొని విగ్రహంబుఁ జెప్పు
    నదియు నిత్యసమాసమై యలరుచుండు

    నట్టిసఁధుల నచ్చు హల్లైన విరతి'

    అని లక్షణము. అని భారతము లక్ష్మీపతి కూర్చిన వ్యాఖ్యలో నున్నట్లు చెప్పబడినది, కాని "ప్రభవించు" "ఉంపమింపగ" అనునవి నిత్యసమాసములగుట కుదురదు.