పుట:Sukavi-Manoranjanamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గాదు. 'ఇంత భ్రాంతత్వ మప్పకవిగారి కుండునా?' అని పండితంమన్యకవులకు భ్రాంతత్వము గలదు. 'ఒకొంటి' కనుచోట స్వరముంటే, స్త్రీపర్వము (1-83) నందలి —
క.

పాండవుల వలన గీడొ
క్కొండును లేదరిప నీదు కొడుకులు ధరణీ
మండల మంతయు మ్రింగిరి
పాండు నృపతి భాగమునకుఁ బాపిరి వారిన్'

121
(అను పద్యమందు) ‘కొడుకు' లనుచోట స్వరము లేకపోవుట పామరులకును స్పష్టమే గనుక ఇచ్చట అప్పకవిగారి మతమున (గూడ) నఖండవడి యనక వల్లగాదు. అయితే, వాస్తవమునకు నిచ్చట వర్గయతి. అచ్చట నఖండయతి. ఈ పద్యము నప్పకవిగారు చూచితే, అచ్చట స్వరప్రధానవడియని సోమయాజిగారు తమతో చెప్పినట్టు వ్రాయరు. 'ఒకొంట' కనుచోట స్వరమయితే లేదుగాని, మూఢు లవలంబించిన మార్గము తమరు అవలంబించితే, దేశ్యనిత్యసమాసము ఉభయవడి గనుక తమ మతము నిలువబట్టును. సుప్రసిద్ధమైన యఖండవడిని ఖండించబోతే, అప్పకవిగారి పాండిత్యమహిమకు చెప్పరానిమహిమ సంభవించినది. మరియును భారతమందు ఖండించిన పద్యము లిటువంటివే కలవు. అవి యన్నియు నెన్నియని వ్రాయము!122
అచ్చు పుస్తకములందు '...మీరలీ, యొనరిన సైన్యముల్...' అని దిద్దినారు. అర్ధ మెదుగలేదు, సరే కదా, యతిభంగమును గానరు. 123
అప్పకవిగారు ('ఆంధ్రశబ్దచింతామణి' యందు)
క.

వీఁకఁ బఱతెంచి నల్గడ
దాకినఁ గడునలిగి ఘోరతరశరతతి న
మ్మూకలు విరియఁగ నర్జునుఁ
డా కరమున నేసె నుగ్రుఁడై రణభూమిన్' (ఆది. 8.200)

124
అని అర్ధబిందుప్రాసముకు లక్ష్యము వ్రాసినారు. 'అర్జునుడు ఆ కరమున నేసె' అని అర్థము చెప్పవలెగదా. 'ఆ కరమ'నగా, నదివరకు నొక కర