ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వ. | అది యెట్లనిన, సులక్షణసారంబునందు లింగముగుంట తిమ్మన | 117 |
ఆదిపర్వము (5.121) —
క. | నా వచనమున నసత్యము | 118 |
అని వ్రాసినారు.
అయితే, 'మునుపున్న పాఠమిది, మధ్యవారు చెప్పిన పాఠమిది' అని వ్రాయలేదు. శ్రోత్రియుడు చండాలుని పేరుచ్చరించనటుల ఆ పాఠమే వ్రాసినారుగాదు. తమరు దిద్దినది ఇదియని యెవరికి తెలియగలదు? మునుపున్నపాఠమని లింగముగుంట తిమ్మన్న మాత్రమే గాదు, లాక్షణికు లందఱును లక్ష్యము వ్రాసినది.
| '... సూవె మనంబునఁ దలంచుచుండెద నేనున్' | |
అని యున్నది. ఇటుల నుండుటే, శ్రీ వ్యాసకృతశ్లోకార్థము ననుసరించి యున్నది.
| 'మమాప్యేష సదా మాద్రి, హృద్యర్థః పరివర్తతే' | |
'నా యొక్క హృదయమందున్ను యీ యర్థమే యెపుడు నుండుచున్నది' అని అర్థము గదా: 'సదా స్మరామి, ధ్యాయామి, చింతయా' మీత్యాదిక్రియాపదములు లేవు. 'తలంతు' నని సకర్మకము గాదు. 'ఏ షోర్థ స్సదా పరివర్తతే' అని నందు వలననే, 'తలంచుచుండెద' నని నన్నయభట్టు గారున్ను రచించినారు. కవితాశయ్య నాలోచించితే, యే పాఠము సాఫుగా నున్నదో కవిత్వకలాధురంధరులకు స్పష్టము కాగలదు. 'అప్పకవి గారు మాత్రము కవితాశయ్య నెఱుంగనివారా?' అనరాదు. కవితాశయ్య నెఱింగినా, అఖండ