ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| మందరధైర్య వంశ నినాద చాతుర్య | 18 |
అని బిందువు దాపలగలిగిన య, ర, ల, వ, శ, ష, స, హ,--ఈ యెనిమిదివర్ణములు మవర్ణముల యతి చెల్లునని చెప్పినారు.
లక్ష్యము-భీమనచాటుధార :
చ. | గరలపుముద్ద లోహ మన గాఢమహాశనికోట్లసమ్మెటల్ | 19 |
ఈ పద్యము భీమకవిగారిదే అయితే (కవిజనాశ్రయము సంజ్ఞా 62)
"క. | స్వరవర్గాఖండ ప్రా | 20 |
అని యీ పద్యము భీమకవిగారు చెప్పినదని సమస్తలాక్షణికులు నంటారు. భీమన పది (యతిభేదములు) చెప్పినాడని తమరున్ను చెప్పిరి. ఈ పదియతులలో మవర్ణ విరామము లేదుగదా!
లక్షణము చెప్పేవరకు (భీమకవిగారు) మవర్ణ విరామము నెఱుగరనిన్ని, పిదప కొంతకాలముకు ముఖ్యముగా మవర్ణ విరామమును జెప్పక వల్లగాదని తోచి ఈ పద్యము చెప్పినారనుకోవలెను. మంచిదే, మకార హకారములకు (లక్ష్యమున యతి చెల్లింపు ఉంటే, (మకార