పుట:Sukavi-Manoranjanamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మందరధైర్య వంశ నినాద చాతుర్య
             మా భూపయువతి పుంషండ రూప
మంజుల స్వాంత కంసధరావర కృతాంత
             స్మర హరారాధ్య సింహనిభమధ్య
యనుచుఁ జరమానునాసికంబునకు నిట్లు
గ్రాలుఁ గృతులను వర్ణ విరామములన
దండి సున్నలు దాపల నుండెనేని
పెలుచ నంతస్థములు నూష్మములను గృష్ణః" (3-76).

18
అని బిందువు దాపలగలిగిన య, ర, ల, వ, శ, ష, స, హ,--ఈ యెనిమిదివర్ణములు మవర్ణముల యతి చెల్లునని చెప్పినారు.
లక్ష్యము-భీమనచాటుధార :
చ.

గరలపుముద్ద లోహ మన గాఢమహాశనికోట్లసమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోరలు పట్టుకార్లు ది
క్కరటి శిరంబు దాయి లయకాలుఁడు కమ్మరి వైరివీర సం
హరసుగుణాభిరాముఁడగు మైలమ భీమన ఖడ్గసృష్టికిన్.

19
ఈ పద్యము భీమకవిగారిదే అయితే (కవిజనాశ్రయము సంజ్ఞా 62)
"క.

స్వరవర్గాఖండ ప్రా
ద్యురుబిందుప్లుతములుం బ్రయుక్తాక్షరముల్
బరువడి యెక్కటి పోలిక
సరసమనం బదివిధములు జను వళ్లరయన్.”

20

అని యీ పద్యము భీమకవిగారు చెప్పినదని సమస్తలాక్షణికులు నంటారు. భీమన పది (యతిభేదములు) చెప్పినాడని తమరున్ను చెప్పిరి. ఈ పదియతులలో మవర్ణ విరామము లేదుగదా!

లక్షణము చెప్పేవరకు (భీమకవిగారు) మవర్ణ విరామము నెఱుగరనిన్ని, పిదప కొంతకాలముకు ముఖ్యముగా మవర్ణ విరామమును జెప్పక వల్లగాదని తోచి ఈ పద్యము చెప్పినారనుకోవలెను. మంచిదే, మకార హకారములకు (లక్ష్యమున యతి చెల్లింపు ఉంటే, (మకార